పాముతో సెల్ఫీ దిగి.. ఇరకాటంలో పడ్డారు.

Published : Aug 08, 2018, 03:21 PM IST
పాముతో సెల్ఫీ దిగి.. ఇరకాటంలో పడ్డారు.

సారాంశం

ఇదే ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో వీరు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.  

సెల్ఫీ పిచ్చి.. ఐదుగురిని కటకటాలు లెక్కపెట్టేలా చేసింది. సోషల్ మీడియాలో లైక్ లు, కామెంట్ల కోసం వారు చేసిన పని.. వారినే సమస్యల్లోకి నెట్టేసింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రాజనాగం పాముతో సెల్ఫీ తీసుకున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కూడలూర్‌ సమీపకన్నంపయల్‌ రోడ్డులో 4వ తేదీ కొందరు ఓ చెట్టుపై నుంచి రాజనాగం పామును పట్టుకుని దాంతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మణికంఠన్‌, రామానుజం, దినేష్‌కుమార్‌, యుగేశ్వరన్‌, విఘ్నేష్‌ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో వీరు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
 

PREV
click me!

Recommended Stories

Mid Day Meal: మ‌ధ్యాహ్న భోజ‌నంలో చికెన్ బిర్యానీ.. ప‌రిశీలిస్తోన్న రాష్ట్ర ప్ర‌భుత్వం
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఈ బిల్లుతో ఏం జరగనుంది.?