రిస్క్ లో పడేసిన సెల్పీ మోజు.. నదిలో జారిపడ్డ యువకుడు.. కేదార్ నాథ్ యాత్రలో ఘటన

Published : Sep 05, 2023, 03:48 PM IST
రిస్క్ లో పడేసిన సెల్పీ మోజు.. నదిలో జారిపడ్డ యువకుడు.. కేదార్ నాథ్ యాత్రలో ఘటన

సారాంశం

కేదార్ నాథ్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సెల్పీ తీసుకుంటూ ఓ యువకుడు మందాకిని నదిలో జారిపడ్డాడు. కొంత దూరం కొట్టుకువెళ్లాడు. అయితే ఓ బండలను పట్టుకొని ఆగిపోయాడు. తరువాత అతడిని స్థానికులు రక్షించారు.

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్ర కొనసాగుతోంది. అందులో భాగంగా మందాకిని నదికి మీదుగా యాత్రికులు నడుస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వానల వల్ల ఆ నది భారీగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు కూడా ప్రమాదానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ రాజ్యాంగాన్నే మార్చాలనుకుంటున్నారు - ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ యాత్రలో భాగంగా పలువురు యాత్రికులు మందాకిని నదికి మీదుగా నడుస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు సెల్పీ తీసుకోవాలని ప్రయత్నించాడు. దీంతో అతడు కాలు జారి నదిలో పడిపోయాడు. ఈ ఘటన రాంబాడ సమీపంలో జరిగింది. 

నదిలో పడిన వెంటనే ఆ యువకుడు ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత బండరాళ్లను చాకచక్యంగా పట్టుకొన్నాడు. వాటిపై ఆగిపోయాడు. ఆ యువకుడు జారి పడటం, బండరాళ్లపై ఆగిపోవడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. తాళ్ల సాయంతో ఆ యువకుడిని బయటకు తీసుకొని వచ్చారు, అయితే ఈ యువకుడు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బండలపై నిలబడి ఉండటం, సహాయక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu