అయోధ్యలో భద్రత మరింత పెంపు.. డ్రోన్స్ కు నో ఎంట్రీ...

Published : Dec 20, 2023, 02:33 PM ISTUpdated : Dec 20, 2023, 03:06 PM IST
అయోధ్యలో భద్రత మరింత పెంపు.. డ్రోన్స్ కు నో ఎంట్రీ...

సారాంశం

జనవరి 22న అయోధ్య బాలరాముడి ఆలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా భారతదేశం, విదేశాల నుండి అనేకమంది ప్రముఖులు హాజరుకానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. 

అయోధ్య : అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బ్లూప్రింట్ కూడా సిద్ధమైంది. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్‌తో పాటు రాష్ట్ర పోలీసు బలగాలను ప్రతి వీధిలో మోహరిస్తారు. అయోధ్యలో ఇప్పటికే భద్రతా కోణంలో చాలా సున్నితంగా ఉందని ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లకు సరిపడా పోలీసులు ఉన్నారు. వీటిలో సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్సీ, పౌర పోలీసు బలగాలు ఉన్నాయి. రామ మందిర భద్రత కోసం త్వరలో కొత్త భద్రతా ఏర్పాట్లు అమలు చేయనున్నారు. దీనిప్రకారం సరైన విచారణ లేకుండా, ఎవరూ ఆలయం దగ్గరకు వెళ్లలేరు.

డ్రోన్లకు అనుమతి తప్పనిసరి.. అనేక చోట్ల చెకింగ్ పాయింట్లు..

భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివిధ చోట్ల చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేయనున్నారు. డ్రోన్లు ఎగరాలంటే అనుమతి తప్పనిసరి. రానున్న రోజుల్లో నది ఒడ్డున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. నది భద్రత పటిష్టం. శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా 37 ప్రభుత్వ, ప్రభుత్వేతర భూముల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. పార్కింగ్ ప్రదేశాల్లో కూడా కెమెరాలు అమర్చనున్నారు.

అయోధ్యలో అడుగడునా టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చలిమంటలు, మొబైల్ టవర్లు..

జనవరి 22-23 తేదీల్లో భారీ వాహనాల ప్రవేశం లేదు

జనవరి 22, 23 తేదీల్లో నగరంలో భారీ వాహనాల ప్రవేశం ఉండదని తెలిపారు. నగరం లోపలికి వెళ్ళనివ్వరు. చిన్న వాహనాలు సులువుగా గమ్యస్థానానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆహ్వానితులకు మెరుగైన ఏర్పాట్లు ఉంటాయి. దారి మళ్లింపు గురించి సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా ఇవ్వబడుతుంది. దీక్షా కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ వింగ్ చురుకుగా ఉంటుంది. భద్రత విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కూడా తీసుకోనున్నారు. తద్వారా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సమాచారం తెలుసుకుని వారిపై నిఘా ఉంచేలా చూస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu