గతంలో ప్రధానికి భద్రతా లోపాలు ఏర్పడ్డాయా? ఎప్పుడెప్పుడు వైఫల్యాలు ఏర్పడ్డాయంటే..!

Published : Jan 06, 2022, 04:18 PM ISTUpdated : Jan 06, 2022, 04:45 PM IST
గతంలో ప్రధానికి భద్రతా లోపాలు ఏర్పడ్డాయా? ఎప్పుడెప్పుడు వైఫల్యాలు ఏర్పడ్డాయంటే..!

సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తన పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం ఏర్పడింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, గతంలోనూ ఇలా ప్రధానమంత్రికి భద్రతా లోపం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. నరేంద్ర మోడీతోపాటు అంతకు ముందటి ప్రధాని మన్మోహన సింగ్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.   

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) తన పంజాబ్ పర్యటన(Punjab Visit) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు రోడ్డు మార్గాన వెళ్లుతుండగా రైతులు ఆందోళన చేయడం.. సుమారు 20 నిమిషాలు ప్రధాన మంత్రి ఓ ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవాల్సి వచ్చింది. భద్రతా లోపం(Security Breach) ఏర్పడ్డ కారణంగా ఆయన అక్కడి నుంచి భటిండాకే వెనుదిరిగి వెళ్లిపోయారు. భటిండా దాకా ప్రాణాలతో చేరగలిగానని, సీఎంకు థాంక్స్ చెప్పాలని ప్రధాని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ ప్రభుత్వం ఎస్‌వోఎస్ ప్రోటోకాల్ పట్టించుకోలేదని ఆగ్రహించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రికి భద్రతా లోపం ఏర్పడ్డ సంఘటనలపై చర్చ జరుగుతున్నది. తాజాగా, పంజాబ్‌లోనే కాదు.. గతంలోనూ ప్రధాన మంత్రికి భద్రతా లోపం పలు సందర్భాల్లో ఏర్పడింది.

ఫిబ్రవరి 2019: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2019లో ఇలాగే.. భద్రతలో లోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఉత్తర 24 పరగణాలలోని అశోక్ నగర్‌లో నిర్వహించిన ఓ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. అక్కడ భద్రతలో పొరపాటు వచ్చింది. భద్రతా చర్యల్లో లోపంతో ఆ సదస్సులో తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని 20 నిమిషాలకే ముగించుకోవాల్సి వచ్చింది. వెంటనే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రంగంలోకి దిగింది. ప్రధాన మోడీకి రక్షణ కల్పించింది.

Also Read: మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టులో పిల్ దాఖలు.. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఏమందంటే

మే 2018: అంతకు ముందు సంవత్సరంలోనూ ప్రధాని మోడీ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. ప్రధాని మోడీ అభిమానిని అని చెప్పుకున్న ఓ వ్యక్తి ఎస్‌పీజీ రక్షణ వలయాన్ని ఛేదించుకుని ప్రధానివైపు రాగలిగాడు. ఈ ఘటన విశ్వ భారతి స్నాతకోత్సవ కార్యక్రమంలో చోటుచేసుకుంది.

డిసెంబర్ 2017: ఈ సంవత్సరంలో ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగరంలో మెట్రో లైన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణిస్తుండగా ఆయన కాన్వాయ్ రెండు నిమిషాలపాటు మరో వైపునకు రెండు నిమిషాలపాటు వెళ్లింది. నోయిడా పోలీసు వల్ల ఈ సమస్య ఎదురైంది. ప్రధాని మోడీ భద్రత నిబంధనలు పాటించడంలో విఫలం కావడం కారణంగా ఇద్దరు నోయిడా పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

2014 డిసెంబర్ 31: మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్లక్ష్యంగా వ్యవహిరంచారు. దీంతో వీరి ముగ్గురిని సస్పెండ్ చేశారు.

Also Read: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది?.. వారి తప్పిదమేనా?.. మాజీ డీజీపీ ఏం చెప్పారంటే..

డిసెంబర్ 2010: అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేరళలో పర్యటిస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్‌కి ఓ ప్రైవేటు కారు అడ్డుగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాలు ఏర్పడ్డాయి. కానీ, అందులో పొరపాటు ఏమీ లేదని ఆ తర్వాత కేరళ ప్రభుత్వం పేర్కొంది.

నవంబర్ 2006: అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎస్కార్ట్‌లోని పైలట్ కారు తప్పు దారిలో వెళ్లింది. దీంతో ఆయన ఎస్కార్ట్ గందరగోళంలో పడింది. దీంతో కేరళ ప్రభుత్వం నుంచి దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది.

జులై 2006: అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలోకి ముగ్గురు యువకులు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా చొచ్చుకు వెళ్లారు. వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చివరకు భద్రతా లోపం ఏమీ జరగలేదని పీఎం ఆఫీసు వెల్లడించింది.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu