‘నువ్వు నాదానివి కాకపోతే ఇంకెవర్వితో ఉండనివ్వను’.. యువతిపై అత్యాచారం చేసి చెట్టకు వేలాడదీసిన ప్రేమోన్మాది

Published : Jan 06, 2022, 03:41 PM IST
‘నువ్వు నాదానివి కాకపోతే ఇంకెవర్వితో ఉండనివ్వను’.. యువతిపై అత్యాచారం చేసి చెట్టకు వేలాడదీసిన ప్రేమోన్మాది

సారాంశం

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో (Dungarpur district) దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువతని వన్‌ సైడెడ్‌గా ప్రేమించిన వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. తొలుత ఆమెపై అత్యాచారం జరిపి.. రాయితో కొట్టి హత్య చేసిన అనంతరం చెట్టుకు (hanging from a tree) వేలాడదీశాడు. 

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో (Dungarpur district) దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువతని వన్‌ సైడెడ్‌గా ప్రేమించిన వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. తొలుత ఆమెపై అత్యాచారం జరిపి.. రాయితో కొట్టి హత్య చేసిన అనంతరం చెట్టుకు (hanging from a tree) వేలాడదీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు.. దుంగార్‌పూర్ జిల్లాలోని సంగ్వారా ప్రాంతంలో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహాన్ని గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే బాధిత యువతికి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె తన కాబోయే భర్తతో ఫోన్‌లో మాట్లాడేది. 

అయితే ఆ యువతి‌ని వన్ సైడ్ లవ్ చేసిన ముఖేష్ నానోమా అనే వ్యక్తి దీనిని జీర్ణించుకోలేకపోయాడు. తనకు దక్కనిది మరోకరికి దక్కకూడదని యువతిపై కోపం పెంచుకున్నాడు. ఆమెను హత్య చేసేందుక ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలోనే మొదట యువతిపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత తలపై రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం చెట్టకు ఉరివేశాడు. అయితే బాలికను హత్య చేయడానికి ముందు నిందితుడు.. ‘నువ్వు నాదానివి కాకపోతే ఇంకెవర్వితో ఉండనివ్వను’ అని చెప్పాడు.

ఈ ఘటనపై ఎస్పీ సుధీర్ జోషి మాట్లాడుతూ.. ‘ యువతి తలకు గాయం కావడం వల్లే హత్య జరిగినట్టుగా తెలిసింది. పోలీసు బృందం 20 గంటల్లో నిందితుడిని పట్టుకుంది. బాధిత యువతిని చాలా కాలంగా ప్రేమిస్తున్నట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. యువతి నిశ్చితార్థం జరగడం తెలిసి నిందితుడు కోపం పెంచుకున్నాడు. యువతిని బావిలోకి తోసి చంపేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఇంటికి పిలిచి కొంత దూరంలో ఉన్న పొలానికి తీసుకెళ్లాడు. అయితే యువతి బావి దగ్గరికి వెళ్లలేదు. దీంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అనంతరం యువతిపై అత్యాచారం చేసి రాయితో తలపై కొట్టాడు. 

Also Read: భార్య వివాహేతర సంబంధం.. యువకుడిని దమ్ము చేసిన మడిలో.. ట్రాక్టర్ తొక్కించి పాశవికంగా హత్య...

ఆ తర్వాత మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీశాడు. చెట్టుకు ఉరి వేసిన తర్వాత యువతి ప్రాణాలతో ఉందో లేదో తెలసుకోవడానికి రాళ్లు విసిరినట్టుగా నిందితుడు  చెప్పాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత మాత్రమే అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు’ అని తెలిపారు. 

ఇక, బాధిత బాలిక కూలి పని చేసేదని చెబుతున్నారు. ఆదివారం బాలిక అన్నయ్య బైక్‌పై వేరే గ్రామానికి వెళ్లాడు. అన్నయ్య, తల్లి వచ్చి చూడగా బాలిక కనపించలేదు. అయితే మరుసటి రోజు యువతి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లుగా వారికి సమాచారం అందింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం