నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తులతో పొడిచి చంపిన రెండో భర్త..

By SumaBala BukkaFirst Published Dec 29, 2021, 7:05 AM IST
Highlights

అప్పటికే అక్కడ కాపు కాసిన నవీన్ కుమార్, అనుచరులు కారును హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద అటకాయించి దాడి చేశారు. ఆమె కుమారుడు, డ్రైవర్ పరారయ్యారు. కారులో ఉన్న అర్చనా రెడ్డిని ముగ్గురు కలిసి దారుణంగా నరికి హత్య చేసి వెళ్లి పోయారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పరిశీలించి ఆమె కుమారుడు, డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బొమ్మనహళ్లి : ఐటీ సిటీలో murder culture పెరిగిపోతోంది. స్నేహితులు, భార్యభర్తలు, ప్రేమికులు సైతం పరస్పరం హత్యలకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. Bangalore ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో అర్చనా రెడ్డి (38) అనే మహిళను ఆమె Second husband నవీన్ కుమార్, మరో ఇద్దిరితో కలిసి కత్తులతో నరికి చంపాడు. 

వివరాల్లోకి వెడితే.. ఆనేకల్ జిగణికి చెందిన అర్చనకు మొదట పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవలు వచ్చి విడిపోయి, తరువాత నవీన్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఆస్తుల విషయంలో అతనితోనూ గొడవలు వచ్చి బెళ్లందూరులో విడిగా జీవిస్తోంది. పురసభ ఎన్నికల్లో ఓటు వేసి కారు డ్రైవర్, కొడుకుతో కలిసి కారులో వస్తోంది. 

అప్పటికే అక్కడ కాపు కాసిన నవీన్ కుమార్, అనుచరులు కారును హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద అటకాయించి దాడి చేశారు. ఆమె కుమారుడు, డ్రైవర్ పరారయ్యారు. కారులో ఉన్న అర్చనా రెడ్డిని ముగ్గురు కలిసి దారుణంగా నరికి హత్య చేసి వెళ్లి పోయారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పరిశీలించి ఆమె కుమారుడు, డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో సినీ నటుడు. Movie star అయిన అతనికి ఇంట్లో చక్కని భార్య ఉండగా... ఒక సినీ నటి తో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతని ప్రేమకు స్పందించింది. ప్రియురాలిని తరచూ ఇంటికి తీసుకు వచ్చేవాడు. ఒక రోజు భార్యకు వారిద్దరి Love affair తెలిసి...భర్తతో గొడవ కూడా పెట్టుకుంది. దీంతో అతను ప్రియురాలిని కూడా ఇంటికి తీసుకువచ్చేసాడు. ముగ్గురూ ఒకే ఇంట్లో ఉంటూ... రోజు గొడవ పడేవారు. ఒక రోజు సమస్యను ఎలాగైనా పరిష్కరించుకోవాలని దారుణానికి పాల్పడ్డారు.

‘అమ్మాయిలు ఇలా ఉంటే.. లైంగిక వేధింపులను నివారించవచ్చు’.. జేఎన్ యూ వివాదాస్పద సలహా.. తప్పుపట్టిన మహిళా కమిషన్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్ పూర్ నగరంలో నివసించే ఇంద్రమోహన్.. భోజ్పూరి సినిమాలలో పేరొందిన నటుడు. అతడికి యోగమాయ అనే భార్య ఉంది.  భార్య ఉండగా.. అతను సినీ నటి నేహా వర్మతో ప్రేమలో పడ్డాడు.  ఇంద్రమోహన్ తో జీవితం  పంచుకోవాలనుకుంది. ఇంద్ర మోహన్ ఇంటికి తీసుకువచ్చి తన స్నేహితురాలని అంటూ భార్యకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నేహా తరచూ ఇంద్రమోహన్ ఇంటికి వస్తూ ఉండేది. ఒకరోజు యోగమాయకు తన భర్త ప్రేమ వ్యవహారం గురించి తెలిసిపోయింది. ఈ విషయంలో ఆమె నిలదీసింది.  కానీ భార్య ని పట్టించుకోకుండా ఇంద్రమోహన్ తన ప్రియురాలు నేహాను ఏకంగా ఇంటికి తీసుకు వచ్చేశాడు. ముగ్గురు ఒకే ఇంట్లో ఉండేవారు. దీనితో ఇంట్లో రోజూ గొడవలు జరిగేవి.

ఒకరోజు ఇంద్ర మోహన్, నేహా కలిసి యోగమాయ పీడ వదిలించు కోవాలని ఒక ప్లాన్ వేశారు, అర్ధరాత్రి యోగమాయ నిద్రపోతున్న సమయంలో ఆమెపై నేహా కూర్చుని కత్తితో పలుమార్లు పొడిచింది. దీంతో యోగమాయ గట్టిగా అరిచింది. ఆమె అరుపులకి పక్క ఇంట్లో ఉన్న అత్తమామలు లేచి వచ్చారు. వారు వచ్చేసరికి యోగమాయ రక్తపుమడుగులో విలవిలలాడుతూ చనిపోయింది. నేహా చేతిలో కత్తి చూసి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం యోగమాయ హత్య కేసులో పోలీసులు నేహా, ఇంద్రమోహన్ ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. 

click me!