మహారాష్ట్రలో ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడ్డ స్కూటర్.. ఇద్దరు మృతి..

Published : Jan 24, 2023, 11:39 AM IST
మహారాష్ట్రలో ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడ్డ స్కూటర్.. ఇద్దరు మృతి..

సారాంశం

ద్విచక్ర వాహనంపై వెడుతున్న స్కూటర్‌ అదుపు తప్పి ఫ్లైఓవర్‌ రక్షణ గోడను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 

థానే : మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం ఓ స్కూటర్ ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. దీంతో వంతెనపై నుంచి కిందికి పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని పౌర అధికారులు తెలిపారు. బాధితులు మజివాడ నుంచి థానే స్టేషన్‌ వైపు వెళుతుండగా క్యాజిల్‌ మిల్‌ నాకా ఫ్లైఓవర్‌పై తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్‌ అవినాష్‌ సావంత్‌ తెలిపారు.

ద్విచక్ర వాహనంపై స్కూటర్‌ రైడర్‌ అదుపు తప్పి ఫ్లైఓవర్‌ రక్షణ గోడను ఢీకొట్టాడని తెలిపారు. ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే థానే సివిల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారి తెలిపారు. వీరిద్దరినీ థానే నగరంలోని లోకమాన్య నగర్‌లో నివసిస్తున్న ప్రతీక్ వినోద్ మోర్ (21), ఉల్లాస్‌నగర్ పట్టణానికి చెందిన రాజేష్ బెచెన్‌ప్రసాద్ గుప్తా (26)గా గుర్తించినట్లు అధికారి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఆయన తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!