"ప్లీజ్..ఆ సమయం సరిపోదు.. గడువు పెంచండి.. ": సుప్రీం కోర్టుకు ఎస్‌బీఐ వినతి.. 

Published : Mar 05, 2024, 12:24 AM IST
"ప్లీజ్..ఆ సమయం సరిపోదు.. గడువు పెంచండి.. ": సుప్రీం కోర్టుకు ఎస్‌బీఐ వినతి.. 

సారాంశం

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ 'రాజ్యాంగ విరుద్ధం' అని సుప్రీం కోర్టు పేర్కొంది . ఎలక్టోరల్ బాండ్ల నుండి వచ్చిన విరాళాల గురించి సమాచారాన్ని పంచుకోవాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఇందుకోసం బ్యాంకుకు 2024 మార్చి 6 వరకు కోర్టు గడువు ఇచ్చింది. ఇప్పుడు దీనిపై ఎస్‌బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గడువును పొడిగించాలని కోరింది.

Electoral Bonds:  ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రజలకు తెలియజేయడానికి జూన్ 30 వరకు పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలక్టోరల్ బాండ్లను "డీకోడింగ్" చేయడం , దాతలను విరాళంతో సరిపోల్చడం సంక్లిష్టమైన ప్రక్రియ అని పిటీషన్‌లో ఎస్‌బిఐ పేర్కొంది, ఎందుకంటే దాతల గుర్తింపులను రహస్యంగా ఉంచడానికి కఠినమైన చర్యలు తీసుకున్నమని తెలిపింది. 

అలాగే.. బాండ్ల కొనుగోలు, బాండ్ల విముక్తికి సంబంధించిన డేటా విడిగా రికార్డ్ చేయబడిందనీ, సెంట్రల్ డేటాబేస్ నిర్వహించబడలేదు. దాతల గుర్తింపు అనామకంగా ఉండేలా ఇది జరిగిందని తెలిపింది. దాత వివరాలను నిర్దేశిత శాఖల్లో సీల్డ్ కవరులో ఉంచామని, అలాంటి సీల్డ్ ఎన్వలప్‌లన్నింటినీ ముంబై మెయిన్ బ్రాంచ్‌లో జమ చేశామని, ప్రతి రాజకీయ పార్టీ నిర్దిష్ట ఖాతాను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఆ పార్టీ అందుకున్న ఎలక్టోరల్ బాండ్లను డిపాజిట్ చేసి క్యాష్ చేసుకోవచ్చు, బాండ్ మొత్తాన్ని జారీ చేసే సమయంలో ఒరిజినల్ బాండ్ , పే-ఇన్ స్లిప్‌లను సీల్డ్ కవర్‌లో భద్రపరచి ముంబై ప్రధాన బ్రాంచ్‌కు పంపాలని పిటిషన్‌లో పేర్కొంది. బాండ్ల వివరాలను మార్చి 6 లోపు బహిర్గతపరచాలంటూ సుప్రీం కోర్టు ను తోసిపుచ్చుతూ..  సమాచారాన్ని ఇవ్వడానికి  సమయం సరిపోదని, గడువు పొడిగించాలంటూ SBI సుప్రీంను కోరింది.  జూన్ 30వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మరి బ్యాంకు వినతిపై అత్యున్నత ధర్మాసనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 అసలేం జరిగిందంటే..?  

ఎలక్టోరల్ బాండ్ స్కీమ్- 2018 ను  రాజ్యాంగ విరుద్ధమని, బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని SBIని ఆదేశించింది. ఏప్రిల్ 2019 నుండి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను (కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదారు పేరు,, ధర వంటివి) అందించాలని SBIని కోరింది. మార్చి 6లోగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురణ కోసం కమిషన్‌కు  ఎస్‌బిఐ సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.   

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu