బాబ్రీ కూల్చివేత.. ఉమాభారతి ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు: సత్యపాల్ జైన్

By Siva KodatiFirst Published Oct 1, 2020, 9:12 PM IST
Highlights

బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా తదితర నేతలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే

బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా తదితర నేతలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని పక్షాలు కోర్టు తీర్పును తప్పు బడుతున్నాయి.

అయితే బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి జస్టిస్ లిబర్హన్ కమిటీ నివేదికగా పేర్కొంటూ మీడియాలో ప్రచురించిన కథనాలపై స్పందించారు అదనపు సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్. 

 

Justice M. S. Liberhan’s statement “Uma Bharti categorically took responsibility for it (demolition of Babri Masjid)” reported in the print media today is not true. ... 1/4

— Satya Pal Jain (@SatyaPalJain)

 

గురువారం సాయంత్రం వరుస ట్వీట్లు చేసిన ఆయన బాబ్రీ కూల్చివేత వ్యవహారంలో మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి ప్రమేయంపై వచ్చిన కథనాలు అవాస్తవాలని తెలిపారు. 
 

... As the counsel representing Advani ji, Joshi ji & Uma Bharti ji before the Liberhan Commission, I was privy to each and every statement recorded by the Commission over 14 years. ... 2/4

— Satya Pal Jain (@SatyaPalJain)

 

లిబర్హన్ కమీషన్ ఏర్పాటుకు ముందే అద్వానీ, జోషి, ఉమా భారతీలకు తాను న్యాయవాదిగా వ్యవహరించాననని జైన్ వెల్లడించారు. 14 సంవత్సరాల పాటు కమీషన్ నమోదు చేసిన ప్రతి ప్రకటన తనకు తెలుసునని ఆయన చెప్పారు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యత వహిస్తున్నట్లు ఉమా భారతి ఎప్పుడు ప్రకటన చేయలేదని సత్యపాల్ తెలిపారు. అంతేకాకుండా చారిత్రక కట్టడాన్ని కరసేవకులు పడగొట్టకుండా ఉండేందుకు గాను అద్వానీ ఆమెను అక్కడికి పంపించారు. అయితే కరసేవకులు ఆమెను వెనక్కి పంపడంతో పాటు మళ్లీ ఇక్కడికి రావొద్దని కోరారు. 

 

... Uma Ji never made any such statement taking any responsibility for the demolition. Infact, she stated that she was sent by Advani ji to the crowd to persuade them against demolishing the structure but Kar-Sewaks sent her back, asking her to go away & to not come again. ..3/4

— Satya Pal Jain (@SatyaPalJain)

 

ప్రభుత్వానికి సమర్పించిన అయోధ్య కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ నివేదికలోని 10వ అధ్యాయం పేరా 125.15లో ఉమా భారతి గురించి తాను చెప్పిన ప్రతి విషయాన్ని జస్టిస్ లిబర్హన్ స్వయంగా పేర్కొన్న విషయాన్ని సత్యపాల్ జైన్ ప్రస్తావించారు. అయితే ఈ రోజు జస్టిస్ లిబర్హన్ చేసిన ప్రకటన ఆయన సమర్పించిన నివేదికకు విరుద్ధంగా ఉందని జైన్ తెలిపారు. 

 

... Justice Liberhan himself mentions what I stated about Uma Bharti ji in para 124.15 in Chapter 10 of the Report of Liberhan Ayodhya Commission of Enquiry submitted by him.

Justice Liberhan’s statement made today thus runs contrary to even his own report! ...4/4 pic.twitter.com/SfRBghvz4M

— Satya Pal Jain (@SatyaPalJain)
click me!