Sanjay Raut: మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం నాడు దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించింది.
Sanjay Raut: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను శుక్రవారం దాదాపు 10 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్లోని ఈడీ కార్యాలయానికి సంజయ్ రౌత్ ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు. దాదాపు పది గంటల విచారణ తరువాత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థ విచారణకు సహకరిస్తానని తెలిపారు. తాను స్వచ్ఛంగా ఉన్నందున ఈడీ దర్యాప్తుకు భయపడనని అన్నారు. “నేను నిర్భయ వ్యక్తిని. నేను నా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. కాబట్టి ఎవ్వరికీ భయపడను. దర్యాప్తు సంస్థ విధి విచారణ చేయడం. వారి విచారణకు సహకరించడం మన విధి. కాబట్టి ఈడీ అధికారులకు సహకరిస్తాను ` అని సంజయ్ రౌత్ తెలిపారు.
పత్రా చావల్ హౌసింగ్ కాంప్లెక్స్ పునరాభివృద్ధిలో కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ లో సంజయ్ రౌత్ కుటుంబ పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో సంజయ్ రౌత్ను ఈడీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్లో సంజయ్ రౌత్ కుటుంబానికి చెందిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
సంజయ్ రౌత్కు విచారణ నిమిత్తం ఈడీ రెండు సమన్లు పంపింది. అంతకుముందు జూన్ 27న సమన్లు పంపబడ్డాయి. జూన్ 28న రౌత్ హాజరుకావాల్సి ఉంది, అయితే, ప్రతిపాదిత ర్యాలీని ఉటంకిస్తూ.. రౌత్ ఈడీ అధికారుల నుండి జూలై 7 వరకు పొడిగించాలని కోరారు. పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోరాడకుండా నిరోధించడానికి ED సమన్లు "కుట్ర" అని రౌత్ పేర్కొన్నాడు. దీనిని ED తిరస్కరించింది. తదుపరి విచారణకు జూలై 1 న ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు సమన్లు జారీ చేశారు
విచారణకు ముందు.. సంజయ్ రౌత్ ఇలా ట్వీట్ చేసాడు. "నేను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ED ముందు హాజరవుతాను. నాకు జారీ చేసిన సమన్లను నేను గౌరవిస్తాను. దర్యాప్తు సంస్థలకు సహకరించడం నా బాధ్యత. శివసేన కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్ద గుమిగూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. చింతించకండి! అని పేర్కొన్నారు. ఈడీ అధికారులు పంపిన సమన్ల ప్రకారం సంజయ్ రౌత్ ఉదయం 11.30 గంటలకు విచారణకు వచ్చారు. సుమారు 10 గంటల విచారణ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
మరోవైపు.. ఈ విచారణను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం నిరసన చేపట్టారు. దీంతో కేంద్ర ఏజెన్సీ కార్యాలయం వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కార్యాలయానికి వెళ్లే రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.