సల్మాన్‌ఖాన్‌కు మరణ బెదిరింపు.. మరింత భద్రత పెంపు..

By Rajesh KarampooriFirst Published Mar 20, 2023, 11:06 PM IST
Highlights

సల్మాన్ ఖాన్ కు మరణ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌కు చెందిన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఇమెయిల్‌లో గోల్డీ బ్రార్ , లారెన్స్ బిష్ణోయ్ పేర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి విషయం ఏంటో చెప్పుకుందాం.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి బెదిరింపు ఇమెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు గోల్డీ బ్రార్, లారెన్స్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 120 (బి), 34, 506 (2) కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో.. పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. ఇంటి(గెలాక్సీ) వెలుపల పోలీసులు భద్రతను పెంచారు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (API)-ర్యాంక్ అధికారులు, ఎనిమిది నుండి పది మంది కానిస్టేబుళ్లు నిత్యం ఆయన భద్రతా కల్పించారు. అలాగే.. సబర్బన్ బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసం-కమ్-ఆఫీస్ వెలుపల అభిమానులను సమావేశపరచడానికి అనుమతించబడదని పోలీసు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్‌కు వై-ప్లస్ కేటగిరీ భద్రతను పోలీసులు అందించారు. అతను తన వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులతో కలిసి బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణించనున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రత కోసం పోలీసులు అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. అదే సమయంలో గ్యాంగ్‌స్టర్లు బిష్ణోయ్, బ్రార్,రోహిత్ లపై బాంద్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

జైలు నుండి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు

సింగర్ సిద్ధూ ముసేవాలే కేసులో వెలుగులోకి వచ్చిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణ జింకలను చంపిన కేసులో క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బటిండా జైలులో ఉన్న లారెన్స్ సల్మాన్ ఖాన్‌ను బెదిరించాడు. హమ్ సాథ్ సాథ్ హై సినిమా సమయంలో సల్మాన్ ఖాన్, టబు, సోనాలి బింద్రే , సైఫ్ అలీ ఖాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి.

గోల్డీ బ్రార్ ఎవరు

సింగర్ సిద్ధూ ముసేవాలా హత్యకేసు సూత్రధారి గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. లారెన్స్ బిష్ణోయ్ బ్రార్‌కు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడ్డాడు. ఈ మొత్తం కుట్ర అతని ఆదేశానుసారం జరిగింది. గోల్డీ బ్రార్ ప్రస్తుతం పరారీలో ఉన్న వీరిపై పలు కేసులు నమోదయ్యాయి.  గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రస్తుతం పంజాబ్ జైలులో ఉన్న బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నిందితులుగా ఉన్నారు. జూన్ 2022 లోనూ సల్మాన్ ఖాన్ పై కొంత మంది దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు.   

click me!