భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసిన వారు ఇంకా సంతోషంగా ఉన్నారా. ప్రతిచోటా దుఃఖం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత, భారతదేశ విభజన పెద్ద తప్పు అని పాకిస్తాన్ ప్రజలు నమ్ముతారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా.. పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరనీ, భారత్ నుంచి ఎందుకు విడిపోయామని, భారత విభజన అతి పెద్ద పొరపాటుగా భావిస్తున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యాలు చేశారు. విప్లవకారుడు హేము కలానీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అఖండ భారతమే సత్యమని, విభజిత భారతదేశం ఒక పీడకల అని అన్నారు. భారత్ నుంచి విడిపోయి ఏడు దశాబ్దాల తర్వాత కూడా పాకిస్థాన్లో దుఃఖం ఉందని, భారత్లో ఆనందం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. అమర అమరవీరుడు హేము కలానీ జయంతి సందర్భంగా సింధీ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ.. మనం నవ భారతదేశాన్ని నిర్మించాలి. భారతదేశం విడిపోయిందని అన్నారు.
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరని, ఇప్పుడు భారత విభజన పొరపాటుగా భావిస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. "ఇది 1947 (విభజన)కి ముందు భారత్. భారత్ నుండి విడిపోయిన వారు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారా? పరోక్షంగా పాకిస్థాన్ గురించి ప్రస్తవించారు. అయితే.. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరులపై దాడులకు పిలుపునిచ్చే సంస్కృతికి భారతదేశం చెందినది కాదనే వాస్తవాన్ని భగవత్ నొక్కి చెప్పారు.
విభజనను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ పై ఇలా అన్నారు. ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసిన వారు ఇంకా సంతోషంగా ఉన్నారా. ప్రతిచోటా దుఃఖం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత, భారతదేశ విభజన పెద్ద తప్పు అని పాకిస్తాన్ ప్రజలు నమ్ముతారు. మరే ఇతర దేశంపై దాడి గురించి మాట్లాడే భావజాలం ఉన్న దేశం భారతదేశం కాదని కూడా స్పష్టం చేశారు.
దీని గురించి భగవత్ మాట్లాడుతూ మనం ఇతరులపై దాడి చేయడం భారతదేశ సంస్కృతి కాదు. పాకిస్థాన్పై భారత్పై దాడి చేయాలని నేనెప్పుడూ చెప్పను. కానీ దానికి తగిన సమాధానం కచ్చితంగా ఇచ్చే సంస్కృతి మనది. మేం ఇలా చేస్తూనే ఉన్నాం, అలాగే చేస్తూనే ఉంటామని అన్నారు. కాగా, ఇటీవల మోహన్ భగవత్ సనాతన్కు సంబంధించి ఓ ప్రకటన చేశారు. సనాతన ధర్మానికి ఎవరి నుంచి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పారు.