వ్యాక్సిన్ తీసుకున్నాక.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి కరోనా పాజిటివ్

By telugu news teamFirst Published Apr 10, 2021, 10:10 AM IST
Highlights

పరిస్థితి కాస్త విషమంగా మారడంతో.. ఆయనను నాగ్ పూర్ లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా ధ్రువీకరించింది.

ఆర్ఎస్ఎస్( రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ) చీఫ్ మోహన్ భగవత్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. పరిస్థితి కాస్త విషమంగా మారడంతో.. ఆయనను నాగ్ పూర్ లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా ధ్రువీకరించింది.

ఆర్ఎస్ఎస్ ఈ మేరకు హిందీలో ట్వీట్ చేసింది. ‘మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయనకు జలుబు, జ్వరం లాంటి కామన్ లక్షణాలు ఉన్నాయి. నాగ్ పూర్ లోని కింగ్ వే హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది ’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

సరిగ్గా నెల రోజుల క్రితం మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సురేష్  భయ్మాజీ జోషిలు కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆయనకు కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.

భారతదేశంలో శుక్రవారం 1.31 లక్షల కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, దేశంలో అత్యధికంగా కేసులు పెరగడం వరుసగా మూడవ రోజు, గత 24 గంటల్లో ఈ వ్యాధి కారణంగా 780 మంది మరణించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 1,31,968 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి.  మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542 కు పెరిగింది. మృతుల సంఖ్య 1,67,642 కు పెరిగింది. దేశంలో 9,79,608 క్రియాశీల కేసులు ఉన్నాయి.

మొత్తం రికవరీల సంఖ్యను 1,19,13,292 కు తీసుకొని మొత్తం 61,899 మంది గురువారం కోలుకున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ , రాజస్థాన్, ఢిల్లీ సహా తొమ్మిది రాష్ట్రాలు కొత్త కేసులలో 83.29 శాతం ఉన్నాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా 58,993 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 58,993 కేసుల్లో ముంబైలో 9,200 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 5,34,603 క్రియాశీల కేసులు ఉన్నాయి.

click me!