దారుణం:4 ఏళ్లుగా సన్యాసినిపై రేప్

By narsimha lodeFirst Published Sep 13, 2018, 3:12 PM IST
Highlights

గత నాలుగేళ్లుగా బిషప్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఓ క్రైస్తవ సన్యాసిని  కేరళలోని కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


తిరువనంతపురం: గత నాలుగేళ్లుగా బిషప్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఓ క్రైస్తవ సన్యాసిని  కేరళలోని కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రోమన్ క్యాథలిక్ చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితురాలు ఆరోపించారు.

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచే డియోసెస్ బిషప్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఓ సన్యాసిని కొట్టాయం పోలీసులను ఆశ్రయించింది.   

2014లో కురవిలంగద్‌ ప్రాంతంలోని అనాథ శరణాలయం వద్ద ఉన్న అతిథి గృహంలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది.  ఇప్పటివరకు తనపై 13 దఫాలు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు  ఆరోపించింది.

ఈ ఘటనపై  2014లోనే రోమన్ కేథలిక్ చర్చి అధికారులకు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాధితురాలు చేస్తున్న ఆరోపణలను బిషప్ తీవ్రంగా ఖండించారు.

బదిలీ చేశారనే అక్కసుతోనే  తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన  సన్యాసినిపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

click me!