ఆయన రాజకీయాల్లో 'ధోనీ' : రాజ్‌నాథ్ సింగ్ 

Published : Sep 05, 2023, 12:59 AM IST
ఆయన రాజకీయాల్లో 'ధోనీ' : రాజ్‌నాథ్ సింగ్ 

సారాంశం

కేంద్ర రక్షణ మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు రాజ్‌నాథ్ సింగ్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వ నాణ్యతను ప్రశంసించారు. అతనిని దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో పోల్చడానికి ప్రయత్నించారు.

మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రను ప్రారంభించింది. సోమవారం నీముచ్ జిల్లా నుంచి జన్ ఆశీర్వాద్ యాత్రను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాజకీయాల్లో మహేంద్ర సింగ్ ధోనీ అని అభివర్ణించారు. 

బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. శివరాజ్ సింగ్ చౌహాన్ ధోనీ లాంటి వాడు. ఇది అతిశయోక్తి కాదు. గత 30 ఏళ్లుగా చౌహాన్ తెలుసు. ఆట ఆరంభం ఎలా ఉన్నా.. మంచి  ముగింపు ఇచ్చి.. ఎలా గెలవాలో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బాగా తెలుసునని అన్నారు.

కమల్ నాథ్ ప్రభుత్వ 15 నెలల పదవీకాలాన్ని ఉటంకిస్తూ.. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీజేపీ రెండింటి పాలనను చూశారని, నిజంగా ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.   ప్రజలకు సేవకుడిగా కూడా సేవ చేస్తాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ నిజమైన ప్రజా సేవకుడని కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన రాజ్‌నాథ్ సింగ్.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందనీ తెలిపారు. 

రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు 

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. తాము చంద్రుడు, అంగారక గ్రహాలను చేరుకుంటున్నామని, సూర్యుడికి దగ్గరగా వెళ్తున్నామని, నిరంతరం ప్రయోగాలు చేస్తున్నామని అన్నారు. కానీ, 20 ఏళ్లుగా కాంగ్రెస్‌ ‘రాహుల్‌ యాన్‌’ను ప్రయోగించడం లేదని ఆయన అన్నారు.

ఉదయనిధి స్టాలిన్ ప్రకటనపై ఫైర్  

సనాతన ధర్మాన్ని నాశనం చేయడంపై తమిళనాడు ప్రభుత్వ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యపై రక్షణ మంత్రి ఎదురుదాడికి దిగారు. సనాతనాన్ని అంతం చేయాలని కుట్ర జరుగుతోందని, పాముకు పాలు పోసి పెంచాలని ఇండియా కూటమి భావిస్తోందని ఆరోపించారు. సనాతన్‌లో మతం, కులం పేరుతో వివక్ష లేదని అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu