రాజస్థాన్ లో సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు : ఐదుగురి మృతి

Published : Jun 04, 2018, 02:05 PM IST
రాజస్థాన్ లో సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు : ఐదుగురి మృతి

సారాంశం

మృతుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయ్ పూర్ జిల్లాలోని మౌంట్ అబూ రోడ్డులో  ప్యాణిస్తున్న సీఆర్ఫీఎఫ్ వాహనాన్ని ఓ ట్రాలీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు జవాన్లతో పాటు ట్రాలీలోని ముగ్గురు చనిపోయారు.  

వేగంగా వచ్చిన ట్రాలీ అదుపుతప్పి ఓ బ్రిడ్జిపై నుండి వెళుతున్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సీఆర్పీఎఫ్ వాహనం ఆ బ్రిడ్జి కిందకు పడిపోయింది. ప్రమాదానికి కారణమైన ట్రాలీలో మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కాగా మరో ముగ్గురు ఇతర ప్రయాణికులు ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet:మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet Telugu
PM Modi Speech: రౌడీలు, గూండాలు మర్యాదగా లొంగిపోండి బెంగాల్లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu