
న్యూఢిల్లీ : రైల్వే Ladies coachలలో ఎక్కే పురుషులకి రైల్వే శాఖ ఝల క్ ఇవ్వనుంది.. అబ్బాయిలు మీరు రైల్వే లేడీస్ కోచ్ లలో ఎక్కుతున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు Railway Police Force మహిళా సిబ్బంది. మహిళల భోగిల్లో అక్రమంగా ప్రయాణిస్తున్న ఏడు వేల మంది యువకులను తాజాగా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. శిక్షణ పొందిన మహిళ అధికారులు, సిబ్బందితో కూడిన 283 బృందాలు 223 రైల్వేస్టేషన్లను మోహరించి తనిఖీలు జరుపుతున్నారు. 1,125 మంది మహిళా ఆర్పిఎఫ్ సిబ్బందిని భారతీయ రైల్వేలో నియమించారు.
లేడీస్ కోచ్ లలో అక్రమంగా ప్రయాణించినందుకు ఒక నెల వ్యవధిలో ఏడు వేల మంది పురుషులను మహిళా పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహిళా సురక్ష కింద నుంచి మేనుంచి మే 31 వ తేదీల మధ్య ఈ డ్రైవ్ ను ఆర్ పిఎఫ్ ప్రకటించింది. రైల్వే నిబంధనల ప్రకారం పురుషులు మహిళల కోసం ప్రత్యేక కోచ్ లలో ప్రయాణించకూడదు. ఇది శిక్షార్హమైన నేరం. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన భద్రత కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘మేరీ సహేలి’ కార్యక్రమం కూడా అమలులో ఉంది. ఈ కాలంలో మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది రేలు ఎస్కార్ట్ విధులు చేపట్టారు. ఈ నెల రోజుల ఆపరేషన్లో ఆర్ పిఎఫ్ సిబ్బంది జారిపడిన పది మంది మహిళల ప్రాణాలను కాపాడారు.