ఆగిన బస్సులో నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే దిమ్మతిరిగే సీన్..

By SumaBala BukkaFirst Published Sep 22, 2022, 2:00 PM IST
Highlights

బస్టాండ్‌లో ఆగిన బస్సు లగేజీ బాక్సులోంచి వింత శబ్దాలు మొదలయ్యాయి. అక్కడే ఉన్న డ్రైవర్ ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్‌లో ఓ బస్సు వచ్చి ఆగింది. ఆ తరువాత ఆ బస్సు లగేజీ బాక్సులోంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యింది. అక్కడే ఉన్న డ్రైవర్ కు మొదట ఏమీ అర్థం కాలేదు.. ఆ తరువాత బస్సులోంచే ఆ శబ్దాలు వస్తున్నాయని తెలుసుకుని ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్లాడు. ఆ శబ్దాలకు భయపడుతూనే బస్సును చెక్ చేశాడు. బస్సు లగేజీ బాక్సులో ఓ భారీ కొండచిలువ  ఉంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సివిల్ లైన్స్ బస్టాండ్‌లో ఓ బస్సు ఆగి ఉంది. అందులోని లగేజీ బాక్సులోంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అది గమనించిన బస్సు డ్రైవర్  ఏం జరుగుతుందో చూసేందుకు ప్రయత్నించాడు. లగేజీ బాక్సును తనిఖీ చేయగా.., అక్కడ ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దాని కదలికలవల్లే ఆ శబ్దాలని అర్థం అయ్యింది. వెంటనే ఎలాంటి ప్రమాదం జరగకుండా.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. 

ద‌మ్ముంటే ముంబై, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శివ‌సేన‌ను ఓడించండి - అమిత్ షాకు ఉద్ద‌వ్ ఠాక్రే స‌వాల్

విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నఅటవీశాఖ అధికారులు అతి కష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

click me!