చెత్తలో పాత పర్సును పడేసిన మహిళ: చివరకు ఇలా షాక్

Published : Nov 14, 2020, 01:14 PM IST
చెత్తలో పాత పర్సును పడేసిన మహిళ: చివరకు ఇలా షాక్

సారాంశం

దిపావళి పర్వదినం సందర్భంగా ఇంటిని శుభ్రపరిచే క్రమంలో పూణేకు చెందిన మహిళ తన పార్సును చెత్తను సేకరించే వ్యానులో వేసింది. ఆ బ్యాగ్ లో ఉన్న ఆభరణాలు గుర్తుకు వచ్చింది. చివరకు ఇలా జరిగింది.

పూణే: మహారాష్ట్రలోని పూణేలో చెత్తలో పాత పర్సును పడేసిన మహిళకు ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. చివరకు ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పనికి రానివాటిని పడేస్తూ వచ్చింది. అందులో ఓ పాత పర్సు కూడా ఉంది. 

అయితే, ఆ పాత పర్సులో రూ.3 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నట్లు తర్వాత గుర్తుకు వచ్చింది. చివరకు దాన్ని ఆమె పొందగలిగింది. రేఖ సులేకర్ అనే మహిళ పాత హ్యాండ్ బ్యాగ్ ను చెత్తను సేకరించే వ్యాన్ ఘంటా గాడిలో వేసింది. కొన్ని గంటల తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుంది. 

వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పీసీఎంసీ ఆరోగ్యాధికారులను సంప్రదించారు. డంపింగ్ యార్డుకు వెళ్లాల్సిందిగా అధికారులు వారికి సూచించారు. బ్యాగ్ కోసం పీసీఎంసీ ఆరోగ్య శాఖ అధికారులు 18 టన్నుల చెత్తలో గాలించారు. 

పింపిరి- చించ్ వాడ మున్సిపల్ కార్పోరేషన్ (పీసీఎంసీ) అధికారులు దాదాపు గంట పాటు చెత్తనంతా కెలికి చివరకు బ్యాగ్ ను కనిపెట్టారు. అందులోని విలువైన వస్తువులు కూడా బయటకు వచ్చాయి. చివరకు ఆ బ్యాగ్ యజమానికి చేరింది.

PREV
click me!

Recommended Stories

Trisha Tattoo Viral: త్రిష చేతికి ఉన్న టాటూ మీనింగ్ తెలిస్తే షాకే| Asianet News Telugu
TVK Vijay: స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించ‌డ‌మే మా ల‌క్ష్యం.. విజ‌య్ పార్టీ ఎమ్మెల్యే వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు