న‌గ‌రాలు, చారిత్ర‌క భ‌వ‌నాల పేర్ల మార్పున‌కు క‌మిష‌న్ ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టులో పిటిష‌న్

Published : Feb 11, 2023, 07:03 PM IST
న‌గ‌రాలు, చారిత్ర‌క భ‌వ‌నాల పేర్ల మార్పున‌కు క‌మిష‌న్ ఏర్పాటు చేయండి:  సుప్రీంకోర్టులో పిటిష‌న్

సారాంశం

New Delhi: నగరాల పేర్లు మార్చేందుకు ప్ర‌త్యేక‌ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ‌లైంది. చారిత్రక తప్పిదాలను సరిదిద్దేందుకు కమిషన్ వేయాలని ఈ పిటిషన్ లో కోరారు. నగరాలు, రోడ్లు, భవనాలు, సంస్థల పేర్లను మార్చేందుకు అనుగుణ‌గా ప్ర‌త్యేక‌ కమిషన్ ను ఏర్పాటు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.  

Supreme Court: భారతదేశంలోని విదేశీ ఆక్రమణదారుల పేరుతో ఉన్న‌ నగరాలు, రోడ్లు, భవనాలు, సంస్థల పేర్లను మార్చేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పిటిషనర్‌ అడ్వకేట్‌ అశ్విని ఉపాధ్యాయ్ త‌న‌ పిటిషన్‌లో వేయికి పైగా పేర్లు ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 25, 29లను ఉటంకిస్తూ, పేరు మార్చే కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్డర్ జారీ చేయాలని అప్పీల్ కోసం దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, చారిత్రక తప్పులను సరిదిద్దడం గురించి కూడా ప్ర‌స్తావించారు. దీనికి సంబంధించి, ఔరంగజేబ్ రోడ్, ఔరంగాబాద్, అలహాబాద్, రాజ్‌పథ్ వంటి అనేక పేర్లను మార్చి స్వదేశీకరణ అంశాల‌ను ప్రస్తావించారు.

పిటిషన్‌లోని చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికి, ఆయ‌న వివిధ‌ కోర్టుల అనేక నిర్ణయాలను కూడా ప్రస్తావించారు. అనాగరిక ఆక్రమణదారుల పేరుతో పురాతన చారిత్రక సాంస్కృతిక మత స్థలాలకు పేర్లు పెట్టడం సార్వభౌమాధికారానికి విరుద్ధమా అనే ప్రశ్నలు కూడా పిటిషన్‌లో లేవనెత్తబడ్డాయి. 

ఇటీవల మొఘల్ గార్డెన్ గా పేరు మార్చారు.. అని ఇలా అనేక ప్రశ్నలతో కూడిన పిటిషన్‌లో.. తాజాగా ప్రభుత్వం రాష్ట్రపతి భవన్‌లో నిర్మించిన మొఘల్ గార్డెన్‌కు అమృత్ ఉద్యాన్‌గా నామకరణం చేసిందని పేర్కొన్నారు. కానీ ఢిల్లీలో ఇప్పటికీ ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి, వాటికి విదేశీ ఆక్రమణదారులు-రాజకీయ నాయకుల నుండి న్యాయమూర్తుల వరకు పేరు పెట్టారు. బాబర్ రోడ్, హుమాయున్ రోడ్, అక్బర్ రోడ్, జహంగీర్ రోడ్, షాజహాన్ రోడ్, బహదూర్ షా రోడ్, షేర్షా రోడ్, ఔరంగజేబ్ రోడ్, తుగ్లక్ రోడ్, సఫ్దర్ జంగ్ రోడ్, నజాఫ్ ఖాన్ రోడ్, జౌహర్ రోడ్, లోధి రోడ్, చెమ్స్‌ఫోర్డ్ రోడ్, హేలీ రోడ్ల పేర్లను ప్ర‌స్తావించారు.

ఢిల్లీలో మహాభారత పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వలేదు.. 

శ్రీకృష్ణుడు, బలరాముడి ఆశీర్వాదంతో పాండవులు ఖాండవప్రస్థ (నిర్జనభూమి)ని ఇంద్రప్రస్థంగా (ఢిల్లీ) మార్చారనీ, అయితే వారి పేరుతో ఒక్క రోడ్డు, మున్సిపల్‌ వార్డు, గ్రామం లేదా అసెంబ్లీ నియోజకవర్గం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతి, ద్రౌపది, అభిమన్యుడు వంటి జాతీయ, సాంస్కృతిక వీరులు, వీరనారీల ప్రస్తావన లేద‌ని కూడా పేర్కొన్నారు. 

విదేశీ ఆక్రమణదారుల పేరుతో రోడ్లు, మునిసిపల్ వార్డులు, గ్రామాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ‌నీ, ఇది సార్వభౌమాధికారానికి వ్యతిరేకం మాత్రమే కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించడానికి, దానిని కాపాడుకోవడానికి-నిర్వహించడానికి ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుందనీ, మతం-సంస్కృతి వంటి అంశాల‌ను దుర్వినియోగం కూడా చేస్తుంద‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు.

వేయికి పైగా పేర్ల ప్రస్తావన.. 

చారిత్రాత్మకమైన 'అజాతశత్రు నగర్'కు అనాగరికుడు 'బేగు' పేరు పెట్టారని, దానిని 'బేగుసరాయ్' అని పిలుస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పురాతన నగరం 'నలంద విహార్' పేరును అక్రంత షరీఫుద్దీన్ పేరుతో బీహార్ షరీఫ్‌గా మార్చారు. బీహార్ లోనే, క్రూరమైన 'దర్భంగా ఖాన్' కారణంగా మిథిలాంచల్ సాంస్కృతిక నగరం 'ద్వార్ బాంగ్' పేరు 'దర్భంగా'గా మార్చబడింది. మతపరమైన నగరం 'హరిపూర్' పేరును 'హాజీ షంషుద్దీన్ షా' హాజీపూర్‌గా మార్చారు. 'సింఘజానీ' పేరు 'జమాల్ బాబా' పేరు మీదుగా 'జమాల్‌పూర్' అయిందని పేర్కొన్నారు. 

అలాగే, వైదిక నగరం 'విదేహ్‌పూర్' పేరు అనాగరికుడు ముజఫర్ ఖాన్ తర్వాత 'ముజఫర్‌పూర్'గా మార్చబడింద‌న్నారు.  మొఘలియా ప్రభుత్వం-ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్థానిక భారతీయ పౌరుల మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేసి, వారి గౌరవప్రదమైన జీవితానికి గ్రహణం కలిగించే లక్ష్యంతో, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నగరాలు, రోడ్లు-భవనాలు-సంస్థల పేర్లను తొలగించాయ‌ని వివ‌రించారు.  అహ్మదాబాద్ నగరానికి కర్ణవతి స్థానంలో మహాభారత వీరుడు కర్ణుని పేరు పెట్టారు. మొఘలులు, ఆఫ్ఘన్లు, బ్రిటిష్ వంటి విదేశీ ఆక్రమణదారులు భారతీయ సంస్కృతిని-చరిత్రను మార్చడం ద్వారా నాశనం చేయడానికి ప్రయత్నించిన వెయ్యికి పైగా చారిత్రక పేర్లు పిటిషన్‌లో ప్రస్తావించబడ్డాయి.

PREV
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu