కాక్ పిట్ లోకి స్నేహితురాలిని ఆహ్వానించిన పైలెట్.. మూడు గంటలపాటు అక్కడే.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

Published : Apr 21, 2023, 01:17 PM IST
కాక్ పిట్ లోకి స్నేహితురాలిని ఆహ్వానించిన పైలెట్.. మూడు గంటలపాటు అక్కడే.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

సారాంశం

ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లోకి రావాల్సిందిగా తన స్నేహితురాలిని పిలిచాడు. ఆ తరువాత ప్రయాణం మొత్తం ఆమె కాక్ పిట్ లోనే గడిపింది. 

న్యూఢిల్లీ : దుబాయ్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే సమయంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎయిర్ ఇండియా పైలట్ తన మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి రావడానికి, అక్కడ ఉండేందుకు అనుమతించిన ఘటనపై శుక్రవారం నాడు భారత ఏవియేషన్ రెగ్యులేటర్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటన ఈ 
ఫిబ్రవరిలో జరిగింది. 

దీనిపై విచారణ జరుపుతున్నామని, సంబంధిత వాస్తవాలను పరిశీలిస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం తెలిపింది. "ఈ చర్య ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తుంది" అని ఒక సీనియర్ డీజీసీఏ అధికారి అన్నారు.

ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లోకి రావాల్సిందిగా.. అదే విమానంలో ప్రయాణీకురాలిగా వస్తున్న తన మహిళా స్నేహితురాలిని పైలట్ ఆహ్వానించాడు. ఆ తరువాత విమానం ల్యాండ్ అయ్యేవరకు పూర్తి ప్రయాణం మొత్తం ఆ మహిళ అక్కడే ఉండిపోయిందని అధికారి తెలిపారు. ఈ ప్రయాణం దాదాపు మూడు గంటలపాటు సాగినట్లు అధికారులు తెలిపారు.

అతిక్ అహ్మద్ తుపాకీ చూసి ప్యాంట్ లో మూత్రం పోసుకున్నాడు - ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన మాజీ పోలీస్ ఆఫీసర్

పైలట్ చర్యలు భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, విమానం, అందులోని ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. విచారణ ఫలితాలను బట్టి పైలట్‌పై సస్పెన్షన్ లేదా లైసెన్స్‌ను రద్దు చేయడంతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని అధికారి తెలిపారు.ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు.

ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల్లో తాజాది. ఏప్రిల్ 18న, ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అనుమానాస్పదంగా విండ్‌షీల్డ్ పగుళ్లు రావడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడానికి మొగ్గుచూపారు. పూణే నుంచి బయలుదేరిన విమానం మామూలుగా ల్యాండ్ అయింది, ఎవరికీ గాయాలు కాలేదు.

మార్చి 12న అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానం గాలిలో ఇంజన్‌ ఒకటి ఫెయిల్‌ కావడంతో జైపూర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో 179 మంది ప్రయాణికులు ఉండగా, వారిని సురక్షితంగా తరలించారు.

ఫిబ్రవరి 15న ముంబై నుంచి నెవార్క్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో లండన్‌కు మళ్లించారు. బెదిరింపు బూటకమని తేలింది, భద్రతా తనిఖీల తర్వాత విమానం తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.
 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu