టూరిస్టుగా మారిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు

Published : Feb 28, 2023, 02:59 AM IST
టూరిస్టుగా మారిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు

సారాంశం

Bengaluru: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ టూరిస్టుగా మారార‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శించింది. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ప్ర‌ధాని సోమవారం నాడు కర్ణాటక ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు.  

Karnataka Congress: దక్షిణాది రాష్ట్రమైన క‌ర్నాట‌క‌లో ప‌ర్యటిస్తున్న ప్ర‌ధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ప్ర‌ధాని మోడీ పర్యాటకుడిగా మారారంటూ కాంగ్రెస్ కర్ణాటక శాఖ మండిపడింది. కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీ ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. 

అయితే, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించింది. గత ఏడాది కర్ణాటక వరద బీభత్సాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్ర‌ధాని ఏనాడూ పర్యటించలేదని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజల జీవితాలు దెబ్బతిన్నప్పుడు, ఆస్తులు దెబ్బతిన్నప్పుడు ప్రధాని మోడీ రాష్ట్రం వైపు తిరిగినా పట్టించుకోలేదని, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఎన్నికల పుణ్యమా అని ప్రధాని మోడీ రాష్ట్రంలో టూరిస్ట్ గా మారిపోయారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన తర్వాత కొత్తగా వేసిన రహదారికి దెబ్బ‌తిన‌డానికి సంబంధించి గతంలో పీఎంవో కోరిన నివేదికపై ఎలాంటి విచారణ జరగలేదని కాంగ్రెస్ ఆరోపించింది.

అవినీతి ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్న బెళగావికి చెందిన సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ రాసిన లేఖపై ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కార‌ణంగా సంతోష్ ప్రాణాలు కోల్పోయార‌ని అన్నారు. "కర్ణాటకను అవినీతి రాజధానిగా మార్చిన మీకు (రాష్ట్ర ప్ర‌భుత్వం), ప్రధాని న‌రేంద్ర మోడీకి ధన్యవాదాలు" అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రధాని మోడీ సర్వశక్తిమంతుడనీ, ఏదైనా చేయగలడని భారతీయ జనతా పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. మ‌రీ ద్రవ్యోల్బణాన్ని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా ఆయన పాకిస్తాన్ వైపు ఎందుకు వేలెత్తి చూపుతున్నారు? గ్యాస్ ధరలు రూ.1,000 దాటేలా, పెట్రోల్ ధర రూ.100 దాటేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

 

 

అవినీతిలో కర్ణాటక రెట్టింపు వేగంతో దూసుకెళ్తోందని కాంగ్రెస్ విమర్శించింది. అవినీతికి చెక్ పెట్టని, ఎలాంటి సంకోచం లేకుండా 40 శాతం కమీషన్ తీసుకున్నందుకు ప్రధాని మోడీకి అభినందనలు అంటూ కాంగ్రెస్ పేర్కొంది. మోడీహై టు ముకిన్హై (మోడీ ఉన్నప్పుడే అన్నీ సాధ్యమే)... అది కరెక్టేనా?' అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రధాని మోడీ పర్యటనకు ముందు వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !