ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లలేదు- కర్ణాటకలో కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి దూసుకెళ్లిన ఘటనపై పోలీసుల వివరణ

Published : Mar 26, 2023, 09:38 AM IST
ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లలేదు- కర్ణాటకలో కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి దూసుకెళ్లిన ఘటనపై పోలీసుల వివరణ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో తన కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. అయితే ఆయనను అక్కడి పోలీసులు, ఎస్పీజీ సభ్యులు అడ్డగించారు. దీంతో అతడి ప్రయత్నం విఫలమైందని, ఎలాంటి భద్రతా ఉల్లంఘనా జరగలేదని కర్ణాటక పోలీసులు స్పష్టం చేశారు. 

కర్ణాటకలోని దావణగెరె మీదుగా ప్రధానమంత్రి కాన్వాయ్‌ శనివారం వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ రావడం కలకలం రేకెత్తించింది. దీంతో ఆయన భద్రతలో ఉల్లంఘనలు జరిగాయని అనుమానాలు తలెత్తాయి. అయితే ప్రధాని భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని కర్ణాటక పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఈ విషయాన్ని ప్రకటించారు. 

రాజస్థాన్ లో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు..

ఎన్నికల రోడ్ షో సందర్భంగా ప్రధాని మోడీ వాహన శ్రేణి వైపు ఓ వ్యక్తి పరిగెత్తడం, అతడు కాన్వాయ్ దగ్గరకు చేరుకోకముందే పోలీసులు అడ్డగించడం ఓ వీడియోలో కనిపించింది. బీజేపీ పాలిత రాష్ట్రంలోని హుబ్బళ్లి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత భద్రతా ఉల్లంఘన జరగడం ఇది రెండోసారి. 

ఆ వ్యక్తి బారికేడ్‌ను ఛేదించడానికి ప్రయత్నించడం గమనించి సీనియర్ పోలీసు అధికారి అలోక్ కుమార్ అతడి వైపు పరిగెత్తి అతన్ని అడ్డుకున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమాండో కూడా ఆయన వెంట పరుగెత్తారు. భద్రతా ఉల్లంఘన వార్తలను అలోక్ కుమార్ ఖండించారు. ఇది విఫల ప్రయత్నంగా అభివర్ణించారు. ‘‘ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. ఈ రోజు దావణగెరెలో గౌరవనీయ ప్రధాని భద్రతలో ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు.’’ అని అన్నారు. ఇది విఫల ప్రయత్నమని, వెంటనే తాను, ఎస్పీజీ అతడిని సురక్షిత దూరంలో పట్టుకున్నామని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హుబ్బళ్లిలో జరిగిన రోడ్ షోలో ఓ యువకుడు బారికేడ్ ను బద్దలుకొట్టి ప్రధాని కారు వైపు దూసుకెళ్లారు. కదులుతున్న కారు రన్నింగ్ బోర్డుపై ప్రధాని నిలబడి తనను చూసేందుకు గుమిగూడిన జనాన్ని చూసి చేతులు ఊపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

"అలా చేయడం వల్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు": రాహుల్ గాంధీపై మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్

పలు ప్రాజెక్టులను ప్రారంభించడానికి, భారీ బహిరంగ సభలో ప్రసంగించడానికి ప్రధాని మోడీ శనివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ ఏడాదిలో ప్రధాని ఈ దక్షిణాది రాష్ట్రానికి రావడం ఇది ఏడోసారి. మండ్యలో బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్ వే, ధార్వాడలో ఐఐటీ క్యాంపస్ ను ప్రారంభించడానికి ప్రధాని మోడీ చివరిసారిగా మార్చి 12న కర్ణాటకలో పర్యటించారు.

'బహిరంగ క్షమాపణ చెప్పాలి': రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముంబై ప్రెస్ క్లబ్ .. ఇంతకీ ఏం జరిగిందంటే..?

వైట్ ఫీల్డ్- కృష్ణరాజపుర మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నమ్మ మెట్రో మార్గాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. స్కూల్ పిల్లలు, మెట్రో కార్మికులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. కొత్త మార్గంతో బెంగళూరు తొలి టెక్ కారిడార్ మెట్రో నెట్ వర్క్ కు అనుసంధానమైంది. వైట్ ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర వరకు 13.71 కిలోమీటర్ల రీచ్ -1 ఎక్స్ టిఎన్ బెంగళూరు మెట్రో రైలు నెట్ వర్క్ ను 63 స్టేషన్లతో 69.66 కిలోమీటర్లకు తీసుకువెళుతుంది. దీంతో నమ్మ మెట్రో ఢిల్లీ మెట్రో తరువాత దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గా మారింది. కాగా.. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24తో ముగియనుండటంతో ఎన్నికల తేదీలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?