President rule in Maharashtra:మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: కోవింద్ ఆమోదం

By narsimha lodeFirst Published Nov 12, 2019, 5:41 PM IST
Highlights

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించారు. గవర్నర్ సిఫారసులకు అనుగుణంగా కేంద్రం కేబినెట్ రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపింది.దీంతో రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. 

ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. గవర్నర్ సిఫారసుకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి మంగళవారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలనకు సిఫారసు చేస్తూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి మంగళవారం నాడు మధ్యాహ్నం  కేంద్రానికి సిఫారసు చేశారు.ఈ సిపారసుకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ గవర్నర్ సిఫారసులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొంది. కేంద్ర కేబినెట్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకొంది.

కేంద్ర కేబినెట్ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకొన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఎన్నికల ముందు బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

అయితే సీఎం పదవి విషయంలో  50:50 ఫార్మూలా కోసం శివసేన పట్టుబట్టింది. సీఎం పదవి విషయమై శివసేన మాత్రం  అంగీకరించలేదు. దీంతో అతిపెద్దపార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. 

ఎన్నికల ముందు బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే సీఎం పదవి విషయంలో 50:50 ఫార్మూలాను పాటించాలని శివసేన బీజేపీ నాయకత్వం ముందు ప్రతిపాదనలను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలపై బీజేపీ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు..

దీంతో శివసేన కూడ తన పట్టును వీడలేదు. దీంతో గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ నేతలు గవర్నర్ తో సమావేశమై ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు చెప్పారు. 

దీంతో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లను కైవసం చేసుకొన్న పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించారు. కానీ, శివసేన కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేకపోయింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీకి గవర్నర్ సోమవారం నాడు రాత్రి ఆహ్వానించారు.

also read:కమల్ హాసన్ తో విభేదాలు: హీరో విజయ్ కు ప్రశాంత్ కిశోర్ గాలం?

మంగళవారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై నిర్ణయాన్ని చెప్పాలని ఎన్సీపీకి గవర్నర్  కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గాను ఎన్సీపీ ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎన్సీపీ సంప్రదింపులు జరుపుతోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు మంగళవారం నాడు మధ్యాహ్నం ముంబైకు చేరుకొంటున్నారు.ఈ తరుణంలో  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నాడు సిఫారసు చేశారు.

Also Read:మహా మలుపు: పవార్ షరతు తలొగ్గిన శివసేన, కేంద్ర మంత్రి రాజీనామా


ప్రధానమంత్రి మోడీ మంగళవారం నాడు మద్యాహ్నం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కేబినెట్ సమావేశంలో  మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది

ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమకు రెండు రోజుల పాటు సమయం ఇవ్వాలని శివసేన కోరింది. కానీ, గవర్నర్ గడువు ఇవ్వలేదు. దీంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు విషయంలో వెనక్కు తగ్గింది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్సీపీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Also Read:‘‘మహా’’ సంక్షోభం: శివసేనకు కాంగ్రెస్ చివరి ఘడియ షాక్

ఈ తరుణంలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఆరు మాసాల పాటు  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉంటుంది. ఆరు మాసాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంటుంది.

click me!