ప్రయాగరాజ్ కుంభమేళాలో అత్యాధునిక భద్రతా చర్యలు ... ఏమిటీ AWT?

Published : Dec 26, 2024, 10:52 PM IST
ప్రయాగరాజ్ కుంభమేళాలో అత్యాధునిక భద్రతా చర్యలు ... ఏమిటీ AWT?

సారాంశం

2025 మహాకుంభలో భద్రత కోసం అధునాతన ఫీచర్లతో కూడిన 4 ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్లు ఏర్పాటు చేయనున్నారు.  

ప్రయాగరాజ్ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళా-2025 ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో యూపీ అగ్నిమాపక,  అత్యవసర సేవల విభాగం అధునాతన ఫీచర్లతో కూడిన 4 ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్లను (AWT) మేళా ప్రాంతంలో వినియోగించనుంది. ఈ ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్లను మేళా ప్రాంతంలో టెంట్ సిటీ,  దృష్ట్యా మోహరించారు. ఇవి వీడియో,  థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్‌తో సహా అనేక ఆధునిక ఫీచర్లతో అమర్చబడి ఉన్నాయి. మేళా ప్రాంతంలో అగ్ని ప్రమాదాలను నివారించడంతో పాటు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఇవి ప్రమాదకర అగ్నిమాపక కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తాయి.

అనేక ప్రత్యేకతలతో కూడిన AWT

మహా కుంభమేళా నోడల్, చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ శర్మ మాట్లాడుతూ... ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్ (AWT) అనేది ఆధునిక అగ్నిమాపక వాహనం. ప్రధానంగా బహుళ అంతస్తుల మరియు ఎత్తైన టెంట్లు, భవనాల్లో అగ్నిమాపక కార్యకలాపాలకు ఇది ఉపయోగపడుతుంది. నాలుగు బూమ్‌లతో నిర్మితమైన AWT 35 మీటర్ల ఎత్తు, 30 మీటర్ల దూరం వరకు అగ్నిమాపక కార్యకలాపాలను నిర్వహించగలదు. ఇది అనేక ఆధునిక ఫీచర్లతో అమర్చబడి ఉంది.

వీడియో, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో కూడి ఉండటం వల్ల దీని ఉపయోగం మరింత పెరుగుతుంది. రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే కాకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను రక్షించడంలో, భద్రతకు కవచంగా కూడా ఇది పనిచేస్తుంది.

131.48 కోట్లతో వాహనాలు, పరికరాల మోహరింపు

డిప్యూటీ డైరెక్టర్ అమన్ శర్మ మాట్లాడుతూ... మహా కుంభమేళాను అగ్ని ప్రమాద రహిత ప్రాంతంగా మార్చడానికి విభాగానికి రూ.66.75 కోట్ల బడ్జెట్ కేటాయించారు.  మొత్తం 131.48 కోట్ల రూపాయలతో వాహనాలు, పరికరాలను  కుంభ ళాలో అగ్ని ప్రమాదాల నుండి రక్షణ కోసం మోహరిస్తున్నారు. వీటిని పూర్తిగా మేళా ప్రాంతంలో మోహరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి మహామకుంభమేళాలో వివిధ రకాల 351కి పైగా అగ్నిమాపక వాహనాలు, 2000 మందికి పైగా శిక్షణ పొందిన సిబ్బంది, 50కి పైగా అగ్నిమాపక కేంద్రాలు, 20 ఫైర్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అఖాడాల టెంట్లను కూడా అగ్నిమాపక పరికరాలతో సన్నద్ధం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu