Prashant Kishor| నిలిచిపోయిన ప్రశాంత్‌ కిషోర్‌ పాదయాత్ర.. అసలేం జరిగింది ?

Published : May 16, 2023, 12:51 AM IST
Prashant Kishor| నిలిచిపోయిన ప్రశాంత్‌ కిషోర్‌ పాదయాత్ర.. అసలేం జరిగింది ?

సారాంశం

Prashant Kishor|రాజకీయ వ్యూహకర్త, IPAC వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పాదయాత్ర దాదాపు 25 రోజుల పాటు వాయిదా పడింది. జూన్ 11 నుంచి పాత తరహాలోనే పాదయాత్ర ప్రారంభం కానుంది.

Prashant Kishor| రాజకీయ వ్యూహకర్త, IPAC వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishor) కాలికి గాయమైంది. దీంతో బీహార్ లో సాగుతోన్న ‘జన సూరజ్‌’ యాత్రకు బ్రేకు పడింది. ఈ సందర్భంలో సమస్తిపూర్‌లోని మోర్వాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్‌ కిషోర్‌ మాట్లాడుతూ.. తన ఎడమ కాలు కండరం కాస్తా దెబ్బ తిన్నడం వల్ల నడవడానికి ఇబ్బందిగా ఉందన్నారు. నిత్యం 20-25 కిలోమీటర్లు అధ్వాన్నమైన రోడ్లపై నడవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని అన్నారు. ఈ సమయంలో 15-20 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారని, అందుకే ప్రయాణాన్ని వాయిదా వేయాలని సూచించారు. జూన్ 11న మోర్వలోని అదే మైదానం నుండి తన యాత్రను మళ్లీ ప్రారంభమవుతుందని అన్నారు.

 2500 కి.మీ. ప్రయాణం 

విశేషమేమిటంటే..ప్రశాంత్ కిషోర్ 2022 అక్టోబరు 2 నుండి జన్ సూరజ్ పాదయాత్ర ద్వారా బీహార్‌లోని గ్రామాలలో నిరంతరం నడుస్తున్నారు. ఈ సమయంలో అతను 2500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి, అతను పశ్చిమ చంపారన్ నుండి శివహర్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి మీదుగా నడిచి మే 11 న సమస్తిపూర్ జిల్లాలోకి ప్రవేశించాడు. దీని తరువాత, పాదాలలో సమస్యల కారణంగా, వైద్యులను సంప్రదించి, యాత్రను కొన్ని రోజులు వాయిదా వేయాలని జన్ సూరజ్ యాత్రకు సంబంధించిన వ్యక్తులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ప్రశాంత్‌ కిషోర్‌ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తున్నది. దాదాపు 12 మంది మాజీ ఐపీఎస్‌ అధికారులు పాదయాత్రలో పాలుపంచుకున్నారు. అలాగే ఆయన మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి ఉప ఎన్నికలో గెలిచారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రాజకీయ పార్టీని ఆయన ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..