పెళ్లి పేరిట మైనర్ బాలికపై అత్యాచారం.. గర్భం రావడంతో..

By telugu news teamFirst Published Jul 26, 2021, 3:14 PM IST
Highlights

ఈ క్రమంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. బాలిక ఇటీవల గర్భం దాల్చింది. విషయం తెలుసుకొన్న కేశవన్‌ ఆమెను అబార్షన్‌ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో మైనర్ బాలికకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది.  దీంతో.. బాలికకు సదరు బాలుడు అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రంలోని బేడరహళ్లి గ్రామానికి చెందిన కేశవన్(21) అదే ప్రాంతానికి చెందిన 17ఏళ్ల విద్యార్థినిని పెళ్లిచేసుకుంటానని ఆశ చూపించాడు. ఈ క్రమంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. బాలిక ఇటీవల గర్భం దాల్చింది. విషయం తెలుసుకొన్న కేశవన్‌ ఆమెను అబార్షన్‌ చేయించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బాలికను ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లాడు. అతనికి కొందరు స్నేహితులు కూడా సహాయం చేశారు.

ఈ విషయాన్ని తెలుసుకొన్న విద్యార్థిని తల్లితండ్రులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేశవన్‌ను అరెస్ట్‌ చేశారు. అతనికి సహకరించిన అళగేశన్‌(28), పచ్చముత్తు(25), ఆనంద్‌(28),  పచ్చప్ప(32), క్రిష్ణన్‌(30), వాసన్, మాదప్పన్‌లతోపాటు 8 మందిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.    

click me!