థియేటర్ లో బాంబు ఉందంటూ నకిలీ ట్వీట్.. చివరకు...

Published : Feb 10, 2021, 09:49 AM ISTUpdated : Feb 10, 2021, 09:52 AM IST
థియేటర్ లో బాంబు ఉందంటూ నకిలీ ట్వీట్.. చివరకు...

సారాంశం

ఆ సినిమా థియేటర్‌లో అనువనువు గాలించగా ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఇది ఫేక్‌ సందేశమని నిర్ధరణకు వచ్చారు. కానీ, ఈ సందేశం పోలీసులు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

సినిమా థియేటర్ లో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి సరదాగా నకిలీ ట్వీట్ చేశాడు. చివరకు ముంబయి సైబర్ క్రైం పోలీసులకు చిక్కి.. జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి చివరి వారంలో ‘మేడం చీఫ్‌ మినిస్టర్‌’ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్‌లో బాంబు పేలుస్తామని బన్వారి సింగ్‌ ట్వీట్‌ చేశాడు. అందుకు బన్వారీ కమాండో సింగ్‌ పేరుతో ట్విటర్‌లో అకౌంట్‌ తెరిచాడు. అదే పేరుతో బాంబు పేలుస్తామనే సందేశాన్ని పోస్టు చేయడంతో ముంబై సైబర్‌ క్రైం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

వెంటనే ఆ సినిమా థియేటర్‌లో అనువనువు గాలించగా ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఇది ఫేక్‌ సందేశమని నిర్ధరణకు వచ్చారు. కానీ, ఈ సందేశం పోలీసులు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ సందేశం హరియాణా నుంచి కమాండో సింగ్‌ పేరుతో బన్వారి ట్విట్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. బన్వారీపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

కేరళ త్రిస్సూర్‌లో భారీ పేలుడు 40 మందికి పైగా | Massive Explosion in Kerala | Asianet News Telugu
Heatwave Alert : భారత్ పై 'మెగా ఎల్ నినో' ఎఫెక్ట్.. ఇకపై ఏంటీ పరిస్థితి..?