ఈ నెల 12న ఉత్తరాఖండ్‌కి ప్రధాని మోడీ.. రూ.4,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల ప్రారంభం, శంకుస్థాపనలు

Siva Kodati |  
Published : Oct 10, 2023, 10:00 PM ISTUpdated : Oct 10, 2023, 10:01 PM IST
ఈ నెల 12న ఉత్తరాఖండ్‌కి ప్రధాని మోడీ.. రూ.4,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల ప్రారంభం, శంకుస్థాపనలు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 12న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 4,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 12న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 8:30 గంటలకు ప్రధానమంత్రి పితోర్‌గఢ్ జిల్లాలోని జోలింగ్‌కాంగ్ చేరుకుంటారు. అక్కడ పార్వతి కుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పవిత్ర ఆది-కైలాష్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ,ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. తర్వాత ఉదయం 9:30 గంటలకు పితోర్‌ఘర్ జిల్లాలోని గుంజి గ్రామానికి మోడీ చేరుకుని, అక్కడ స్థానిక ప్రజలతో మమేకమవుతారు. అనంతరం స్థానిక కళలు , ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. పర్యటన సందర్భంగా ఆర్మీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) సిబ్బందితో కూడా ప్రధాని సంభాషించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని.. అల్మోరా జిల్లా జగేశ్వర్‌కు చేరుకుని జగేశ్వర్ ధామ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సుమారు 6200 అడుగుల ఎత్తులో ఉన్న జగేశ్వర్ ధామ్ దాదాపు 224 రాతి దేవాలయాలను కలిగి ఉంది. ఆ తర్వాత.. ప్రధాని మధ్యాహ్నం 2:30 గంటలకు పితోర్‌గఢ్‌కు చేరుకుంటారు, అక్కడ గ్రామీణాభివృద్ధి, రోడ్లు, విద్యుత్తు, నీటిపారుదల, త్రాగునీరు వంటి రంగాలలో దాదాపు 4200 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. 

పీఎంజీఎస్‌వై కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన 76 గ్రామీణ రహదారులు , 25 వంతెనలను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని.  ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. 9 జిల్లాల్లో బీడీవో కార్యాలయాల 15 భవనాలు, సెంట్రల్ రోడ్ ఫండ్ కింద నిర్మించిన కౌసాని బాగేశ్వర్ రోడ్, ధారి-దౌబా-గిరిచీనా రోడ్ , నాగాల-కిచ్చా రోడ్ల అప్‌గ్రేడేషన్, అల్మోర పెట్‌షాల్ - పనువానౌలా - దన్య (NH 309B) మరియు తనక్‌పూర్ - చల్తీ (NH 125) రెండు రోడ్ల నవీకరణ. 38 పంపింగ్ తాగునీటి పథకాలు, 419 గ్రావిటీ ఆధారిత నీటి సరఫరా పథకాలు , మూడు గొట్టపు బావుల ఆధారిత నీటి సరఫరా పథకాలు; పితోర్‌ఘర్‌లోని థార్కోట్ కృత్రిమ సరస్సు, 132 KV పితోరాఘర్-లోహాఘాట్ (చంపావత్) పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్; ఉత్తరాఖండ్ మీదుగా 39 వంతెనలు , డెహ్రాడూన్‌లోని ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (USDMA) భవనం .

శంకుస్థాపన చేయబడే ప్రాజెక్టుల విషయానికి వస్తే.. 21,398 పాలీ-హౌస్‌ల నిర్మాణం, అధిక సాంద్రత కలిగిన ఇంటెన్సివ్ ఆపిల్ తోటల పెంపకం కోసం ఒక పథకం; NH రోడ్ అప్‌గ్రేడేషన్ కోసం ఐదు ప్రాజెక్టులు, రాష్ట్రంలో విపత్తు సంసిద్ధత కోసం వంతెనల నిర్మాణం, డెహ్రాడూన్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయడం, బలియానాలా, నైనిటాల్‌లో కొండచరియలు విరిగిపడకుండా నిరోధించడానికి అగ్ని, ఆరోగ్యం , అటవీకి సంబంధించిన ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.

రాష్ట్రవ్యాప్తంగా 20 మోడల్ డిగ్రీ కళాశాలలో హాస్టళ్లు,  కంప్యూటర్ ల్యాబ్‌ల అభివృద్ధి; సోమేశ్వర్, అల్మోరాలో 100 పడకల ఉప జిల్లా ఆసుపత్రి, చంపావత్‌లో 50 పడకల హాస్పిటల్ బ్లాక్, నైనిటాల్‌లోని హల్ద్వానీ స్టేడియంలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ గ్రౌండ్, రుద్రపూర్ వద్ద వెలోడ్రోమ్ స్టేడియం, జగేశ్వర్ ధామ్ (అల్మోరా), హాత్ కాళికా (పిథోర్‌ఘర్) నైనా దేవి (నైనిటాల్) ఆలయాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మనస్‌ఖండ్ మందిర్ మాల మిషన్ పథకం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు