భారత్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది: బడ్జెట్‌పై మోడీ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 01, 2021, 03:21 PM ISTUpdated : Feb 01, 2021, 03:22 PM IST
భారత్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది: బడ్జెట్‌పై మోడీ వ్యాఖ్యలు

సారాంశం

దేశ ప్రజలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాలకు నిర్మలా సీతారామన్ చేయూతనిచ్చారని మోడీ తెలిపారు. 

దేశ ప్రజలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాలకు నిర్మలా సీతారామన్ చేయూతనిచ్చారని మోడీ తెలిపారు.

మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రధాని గుర్తుచేశారు. రైతుల ఆదాయం రెట్టింపవుతుందని.. ఆత్మనిర్భర్ భారత్‌కు బడ్జెట్ విజన్‌లా పనిచేస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్ననట్లు ప్రధాని పేర్కొన్నారు. ఆరోగ్య రంగం బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని మోడీ వెల్లడించారు. 2021 బడ్జెట్ భారతదేశ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే

PREV
click me!

Recommended Stories

మీకు SBI లో అకౌంట్ ఉందా..? అయితే మీ ఫోన్ నుండే ఈజీగా రూ.35,00,000 పొందండిలా..
Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu