జల్ ఫర్ ఆజ్, కల్.. దేశవ్యాప్తంగా సురక్షితమైన తాగునీటి సరఫరా.. ప్రధాని ప్రత్యేక దృష్టి..

Published : Feb 26, 2023, 10:38 PM ISTUpdated : Feb 26, 2023, 11:11 PM IST
 జల్ ఫర్ ఆజ్, కల్.. దేశవ్యాప్తంగా సురక్షితమైన తాగునీటి సరఫరా.. ప్రధాని ప్రత్యేక దృష్టి..

సారాంశం

ప్రధాని మోదీ సోమవారం నాడు కర్ణాటకలోని శివమొగ్గ, బెలగావి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద రూ. 2500 కోట్ల కంటే ఎక్కువ విలువైన నీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీని వల్ల రెండు జిల్లాలకు చెందిన 13 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుంది.

దేశంలోని అన్ని ప్రాంతాలకు సురక్షితమైన మంచినీటి సరఫరాను ఏర్పాటు చేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి సారించారు. రేపు (సోమవారం) కర్ణాటకలోని శివమొగ్గ, బెళగావి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రెండు జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద రూ.2,500 కోట్లకు పైగా విలువైన నీటి సరఫరా ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించనున్నారు. దీని వల్ల రెండు జిల్లాలకు చెందిన 13 లక్షల మందికి పైగా ప్రయోజనం కలుగుతుంది. 

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఇటీవల ప్రారంభించిన చాలా ప్రాజెక్టులలో నీటి సరఫరా ప్రాజెక్టుల ప్రాబల్యం కనిపిస్తుంది.

ఇటీవల జరిగిన ప్రారంభోత్సవాలను పరిశీలించండి:

  • ఫిబ్రవరి 6న తుమకూరులోని టిపత్తూర్ , చిక్కనాయకనహళ్లిలో రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రూ.430 కోట్లకు పైగా వ్యయంతో తిపత్తూర్ మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. చిక్కనాయకనహళ్లి తాలూకాలోని 147 హ్యాబిటేషన్స్‌కు మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ కింద రూ.115 కోట్లను వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.                                                                                                                                        
  • జనవరి 19న యాద్గిరి జిల్లా కోడెకల్‌లో జల్ జీవన్ మిషన్ కింద యాద్గిరి మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్‌కి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ పథకం కింద 117 ఎంఎల్‌డీ నీటి శుద్ధి ఫ్లాంట్ కూడా నిర్మించబడుతుంది. రూ.2050 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా యాద్గిరి జిల్లాలోని 700కు పైగా గ్రామీణ ఆవాసాలు, మూడు పట్టణాల్లోని దాదాపు 2.3 లక్షల గృహాలకు తాగునీరు అందుతుంది.                                                                                                                                                                                                            
  • గతేడాది అక్టోబర్ 31న రధానమంత్రి మోడీ బనస్కాంత సందర్శించారు. ప్రధాన నర్మదా కాలువ నుండి కాసర నుండి దంతివాడ పైప్‌లైన్, సుజ్లాం సుఫ్లామ్ కెనాల్ బలోపేతం, మోధేరా-మోతీ దౌ పొడిగింపుతో సహా జిల్లాలో రూ. 8,000 కోట్ల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభించారు. ముక్తేశ్వర్ డ్యామ్-కర్మావత్ సరస్సుకు పైప్‌లైన్, సంతాల్‌పూర్ తాలూకాలోని 11 గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి అందించారు.                                                                                                                                                                                                             
  • అలాగే.. గతేడాది అక్టోబరు 19,20 తేదీలతో ప్రధాని మోడీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. జునాఘర్, రాజ్‌కోట్ మరియు వ్యారాలో వివిధ నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జునాగఢ్‌లో రెండు నీటి సరఫరా ప్రాజెక్టులకు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్‌బందర్‌కు మురుగునీరు, నీటి సరఫరా ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే..  రాజ్‌కోట్‌లో రెండు నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాపీలోని వ్యారాలో రూ.300 కోట్ల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

 

  • అక్టోబర్ 10: ప్రధాని మోదీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పర్యటించారు.కలవాడ్/జామ్‌నగర్ తాలూకా మోర్బి-మలియా-జోడియా గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి సరఫరా పథకానికి చెందిన కలవాడ్ గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు. సౌరాష్ట్ర అవతరణ్ ఇరిగేషన్ (SAUNI) యోజన లింక్ 3 (ఉండ్ డ్యామ్ నుండి సోన్మతి డ్యామ్ వరకు), SAUNI యోజన ప్యాకేజీ 5 యొక్క ప్యాకేజీ 7ని ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.                                                                                                                                        
  • సెప్టెంబర్ 29: ప్రధాని మోదీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో పర్యటించారు. నీటి సరఫరా,  పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అలాగే..  సౌనీ యోజన లింక్ 2, 25 MW పాలిటానా సోలార్ PV ప్రాజెక్ట్, APPL కంటైనర్ (Aawadkrupa Plastomech Pvt. Ltd.) ప్రాజెక్ట్ యొక్క 7వ ప్యాకేజీని ప్రారంభించాడు. సౌని యోజన లింక్ 2 యొక్క ప్యాకేజీ 9, చోర్వడ్ల జోన్ నీటి సరఫరా ప్రాజెక్టుతో సహా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

 

  • ఆగస్ట్ 28: ప్రధానమంత్రి మోదీ ఆగస్ట్ 28న గుజరాత్‌లోని భుజ్‌ను సందర్శించారు. ఆ రోజు కచ్ జిల్లాలోని మొత్తం 948 గ్రామాలు, 10 పట్టణాలకు త్రాగునీటి సౌకర్యాన్ని అందించే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన కాలువ అయిన  కచ్ బ్రాంచ్ కెనాల్‌ను ప్రారంభించారు.                                                                           
  • జూలై 7: ప్రధానమంత్రి మోడీ వారణాసిని సందర్శించి..  తాతేపూర్ గ్రామంలో గ్రామీణ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు.                                                                                                                                                                                                  
  • జూన్ 10: ప్రధాని మోదీ గుజరాత్‌లో సందర్శించి, నీటి సరఫరా ఇంజనీరింగ్ నైపుణ్యాలకు అద్భుతంగా నిలిచిన ఆస్టోల్ ప్రాంతీయ నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే, ₹163 కోట్ల విలువైన 'నల్ సే జల్' ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా  సూరత్, నవ్‌సారి, వల్సాద్ , తాపి జిల్లాల వాసులకు సురక్షితమైన మంచినీటిని అందించనున్నారు.                                                                    
  • జనవరి 4: ప్రధాని మోదీ  మణిపూర్‌లో 4 జనవరి, 2022న పర్యటించారు . ఇంఫాల్ నగరానికి తాగునీటి సరఫరా కోసం రూ.280 కోట్ల 'తౌబాల్ బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ యొక్క నీటి ప్రసార వ్యవస్థ'ను ప్రారంభించారు. తమెంగ్‌లాంగ్ జిల్లాలోని పది ఆవాసాల వాసులకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు రూ.65 కోట్లతో నిర్మించిన నీటి సరఫరా పథకం ప్రాజెక్టును, సేనాపతి జిల్లా హెడ్‌క్వార్టర్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ను కూడా ఆయన ప్రారంభించారు. రూ. 51 కోట్లతో ఈ ప్రాంత వాసులకు సక్రమంగా నీటి వసతి కల్పించాలన్నారు.

PREV
click me!

Recommended Stories

Viral Video : ఎయిర్‌పోర్ట్‌లో తండ్రిని చూసి పరుగెత్తిన చిన్నారి.. జవాన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా ! వైరల్ వీడియో
Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?