బీజేపీ కార్యకర్తలతో మోదీ చిట్ చాట్.. మీరు కూడా సలహాలు ఇవ్వొచ్చు..!

Published : Jan 15, 2022, 12:12 PM ISTUpdated : Jan 15, 2022, 12:14 PM IST
బీజేపీ కార్యకర్తలతో మోదీ చిట్ చాట్..  మీరు కూడా సలహాలు ఇవ్వొచ్చు..!

సారాంశం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి  లోని నుంచి బీజేపీ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషిస్తారని ఆ పార్టీ శనివారం తెలిపింది. ఈ మేరకు బీజేపీ ట్విట్టర్ లో ప్రకటించింది. 

బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్రమోదీ  చిట్ చాట్ చేయనున్నారు. జనవరి 18న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి  లోని నుంచి బీజేపీ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషిస్తారని ఆ పార్టీ శనివారం తెలిపింది. ఈ మేరకు బీజేపీ ట్విట్టర్ లో ప్రకటించింది. 

ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత పార్టీ కార్యకర్తలు పాల్గొనే మోదీ మొదటి రాజకీయ కార్యక్రమం ఇది కావడం గమనార్హం.

 

బిజెపి ఉత్తరప్రదేశ్ యూనిట్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను పంచుకుంది.  దాని కోసం వారి ఆలోచనలు,  సూచనలను NaMo యాప్ ద్వారా పంచుకోవాలని ప్రజలను కోరింది.

అసెంబ్లీ ఎన్నికలను ప్రకటిస్తూ, ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ఎన్నికల సంఘం జనవరి 15 వరకు బహిరంగ సభలు,  రోడ్‌షోలను నిషేధించింది.  దాని భవిష్యత్తు మార్గదర్శకాలను శనివారం రోజు తర్వాత తెలియజేయనుంది.

కాగా... ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలనకుంటే.. ఇవ్వొచ్చని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే.. అందుకోసం నమో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే..  1800 2090 920కి డయల్ చేయండి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?