
అస్సాంలోని దిబ్రుగఢ్లో ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ టీ తోటను సందర్శించి అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడారు. టీ తోటలో వారి పనితీరు, జీవన విధానం గురించి తెలుసుకుంటూ కొంతసేపు వారితో గడిపారు. ఈ సందర్భంగా మోదీ టీ ఆకులు కోసిన దృశ్యాలు, మహిళలతో తీసుకున్న ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.