తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం .. విపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం..

Rajesh K | Published : Oct 2, 2023 11:57 PM

ప్రతిపక్షాలు కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

ప్రతిపక్షాలు కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పేదల భావోద్వేగాలతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయని ప్రధాని అన్నారు. బీహార్ కులాల సర్వే గురించి గానీ, ఏదైనా నిర్దిష్ట పార్టీ గురించి గానీ ప్రస్తావించకుండా.. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

మధ్యప్రదేశ్ లో కూడా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సోమవారం  ఆ రాష్ట్రంలోని గ్వాలియర్ లో పర్యటించారు. ఈ క్రమంలో దాదాపు    రూ.19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకపడ్డారు. 

మనం దేశాన్ని ఆరు దశబ్దాల పాటు అభివృద్ధి వ్యతిరేకులకు చేతిలో పెట్టామని అన్నారు. గత 9 ఏళ్లలో తమ ప్రభుత్వం ఇంత పని చేయగలిగితే.. 60 ఏళ్లలో  వారు ఎంత పని చేయాలని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడువకుండా అడ్డుకున్నారనీ, ఇది ఖచ్చితంగా వారి వైఫల్యమని అన్నారు. అప్పుడూ అధికారంలో ఉండి పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకున్నారనీ, నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే ఆట ఆడుతున్నారని అన్నారు.  అప్పుడు కులం పేరుతో సమాజాన్ని చీల్చారనీ, నేడు కూడా అదే పాపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సోమవారం బీహార్ ప్రభుత్వం కులంపై సర్వే నివేదికను విడుదల చేసిన తరుణంలో ప్రధాని మోదీ ఇలా విమర్శలు కురిపించారు. ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ దురహంకార కూటమి నేతలు మహిళలను ఉద్దేశించి ఎలాంటి కించపరిచే మాటలు మాట్లాడుతున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నామనీ, మహిళలకు హక్కులు దక్కడం లేదని, అందుకే కులం, సాకులు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ప్రధాని అన్నారు. మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజులో చేసినంత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులు ఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేయలేవని, కొత్త ఆలోచనలు లేని, అభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌ లేని వ్యక్తుల వల్ల మధ్యప్రదేశ్‌ అభివృద్ధి చెందదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రగతిని ద్వేషించడమే వారి ఏకైక పనినీ, వారి ద్వేషంతో దేశం సాధించిన విజయాలను కూడా మర్చిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్‌పై ప్రధాని  

మహిళా రిజర్వేషన్‌పై ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ గత 70 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి మా అక్కాచెల్లెళ్లను పదే పదే ఓట్లు అడిగారని, కానీ, ఆ చట్టాన్ని రూపకల్పన కూడా చేయలేదని, పైగా కుట్రలు చేసి మహిళ చట్టం చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నేరవేర్చమనీ, నేడు మహిళా శక్తి బిల్లును చట్టంగా మార్చమని అన్నారు.  

click me!