'అందుకే శరద్ పవార్‌కు ప్రధాని అయ్యే అవకాశం రాలేదు' : ప్రధాని మోదీ

Published : Aug 09, 2023, 02:28 PM IST
'అందుకే శరద్ పవార్‌కు ప్రధాని అయ్యే అవకాశం రాలేదు' : ప్రధాని మోదీ

సారాంశం

కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాల కారణంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ప్రధాని అయ్యే అవకాశం రాలేదని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎన్సీపీ విడిపోయిన సమయంలో అజిత్ పవార్ తిరుగుబాటుకు నాయకత్వం వహించి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్‌కు కాంగ్రెస్ రాజవంశ రాజకీయాల కారణంగా ప్రధాని అయ్యే అవకాశం రాలేదని ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్ కు చెందిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఎంపిలతో జరిగిన సమావేశంలోప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పై విమర్శాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ బంధుప్రీతి కారణంగా శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ 
వంటి చాలా మంది ప్రతిభావంతులను ప్రోత్సహించలేదని అన్నారు.

ఎన్డీయే కూటమిలో తమ మిత్రపక్షాలే ముఖ్యమని, అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. బీజేపీకి కాంగ్రెస్‌లా అహంకారం లేదని, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ఆయన తేల్చిచెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి (74)తో పోలిస్తే జెడి(యు) (జనతాదళ్ (యునైటెడ్))కి తక్కువ సీట్లు (43) వచ్చినప్పటికీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారని ప్రధాని మోదీ అన్నారు.

శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీ తమతో పొత్తు తెంచుకోలేదని అన్నారు. “వారు కారణం లేకుండా వివాదాలు సృష్టించారు.. అయినా సహించాం.. ఒక్కోసారి మేం పుచ్చుకున్నాం.. ఓ వైపు అధికారంలో ఉండాలంటూ మరోవైపు విమర్శల పాలవుతున్నారు.. ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయి? ' అని ప్రశ్నించారు.

గత నెలలో ఎన్‌సిపి నిలువునా చీలిపోయిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్, మరో ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల ప్రారంభంలో శరద్ పవార్ పూణేలో తిలక్ జాతీయ అవార్డు వేడుకలో ప్రధాని మోదీతో వేదికను పంచుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu