భారత ప్రజలు బీజేపీని ఓడించబోతున్నారు: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ

By Mahesh RajamoniFirst Published Jun 4, 2023, 2:13 PM IST
Highlights

New Delhi: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు చోటుచేుకుంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో పర్యటనల అనంతరం న్యూయార్క్ లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇలాంటి విజయానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, భారతీయ ప్రజలు కూడా కారణమన్నారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో సానుకూల ఫలితాలు కాంగ్రెస్ కు వుంటాయని అన్నారు.
 

Congress leader Rahul Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో పర్యటనల అనంతరం న్యూయార్క్ లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇలాంటి విజయానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, భారతీయ ప్రజలు కూడా కారణమన్నారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో సానుకూల ఫలితాలు కాంగ్రెస్ కు వుంటాయని అన్నారు.

వివరాల్లోకెళ్తే.. కర్నాటక ఎన్నికల విజయం తర్వాత తమ పార్టీ తెలంగాణ, ఇతర రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీని నిర్వీర్యం చేస్తుందని , కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు, విద్వేషపూరిత భావజాలాన్ని భారత ప్రజలే ఓడించబోతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. "బీజేపీని గద్దె దించగలమని కర్ణాటకలో చూపించాం. మేము వారిని ఓడించలేదు, నాశనం చేసాము. కర్ణాటకలో వాటిని ధ్వంసం చేశాం' అని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ అన్నారు. వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలను సందర్శించిన తర్వాత రాహుల్ గాంధీ న్యూయార్క్ చేరుకున్నారు. ఆదివారం మాన్‌హాటన్‌లోని జావిట్స్ సెంటర్‌లో కమ్యూనిటీ ర్యాలీలో ప్రసంగిస్తారని సమాచారం. 

"కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పుస్తకంలోని ప్రతిదాన్ని ప్రయత్నించింది. వారి వద్ద మొత్తం మీడియా ఉంది. మా వద్ద ఉన్న డబ్బుకు 10 రెట్లు ఎక్కువ డబ్బు ఉంది. వారికి ప్రభుత్వం ఉంది. ఏజెన్సీ ఉందని" రాహుల్ గాంధీ అన్నారు. అయినప్పటికీ ప్రజల మద్దతుతో బీజేపీనీ ఓడించాము.. ఆ తర్వాత తెలంగాణలో ఇదే తరహా ఫలితంతో ముందుకు సాగుతామని అన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీని గుర్తించడం కష్టంగా మారుతుందనీ, ఆ పార్టీ కనపడకుండా పోతుందని అన్నారు. 

ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని కనుగొనడం కష్టమేనని ఆయన అన్నారు. దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా పాల్గొన్న ఈ కమ్యూనిటీ కార్యక్రమానికి కాంగ్రెస్ మద్దతుదారులు, అధికారులు, పార్టీ సభ్యులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ ఎన్నికలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లకు కూడా ఎన్నికలు ఉన్నాయనీ, కర్ణాటకలోని ఫలితమే రిపీట్ అవుతుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

click me!