పెహ్లూ ఖాన్ కేసు: ఆరుగురు నిర్ధోషులుగా తేల్చిన కోర్టు

Published : Aug 14, 2019, 06:26 PM IST
పెహ్లూ ఖాన్ కేసు: ఆరుగురు నిర్ధోషులుగా తేల్చిన కోర్టు

సారాంశం

గోరక్షకుల దాడిలో మృతి చెందిన పెహ్లు ఖాన్ కేసులో ఆరుగురు నిందితులను కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది.


జైపూర్: రాజస్థాన్ లోని పెహ్లూ ఖాన్  హత్య కేసులో ఆరుగురు నిందితులను కోర్టు బుధవారం నాడు నిర్ధోషులుగా ప్రకటించింది.

రాజస్తాన్ లోని అల్వార్ జిల్లా కోర్టు బుధవారం నాడు ఈ కోర్టులో ఆరుగురు నిందితులను నిర్ధోషులుగా తేల్చింది.ఈ కేసు నమోదైన 
సమయంలో మైనర్లుగా ఉన్న ముగ్గురికి జువైనల్ కోర్టు ప్రత్యేకంగా విచారించనుంది.

2017 ఏప్రిల్ మాసంలో ఖాన్ హత్యకు గురయ్యారు.గోరక్షకులు జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై బెహ్రర్ వద్ద దాడికి దిగడంతో ఆయన మృతి చెందాడు.హర్యానాలోని నుహ నుండి ఆవులను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఖాన్ తో పాటు ఆయన కొడుకు కూడ ఉన్నాడు. తీవ్ర గాయాలతో ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

PREV
click me!

Recommended Stories

Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu
RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?