వైజాగ్ ఘ‌ట‌న తో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వెన‌క‌బ‌డిన టీడీపీ

Published : Oct 17, 2022, 11:12 AM ISTUpdated : Oct 17, 2022, 11:13 AM IST
వైజాగ్ ఘ‌ట‌న తో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వెన‌క‌బ‌డిన టీడీపీ

సారాంశం

రెండు రోజులుగా వైజాగ్ లో జరిగిన పరిణామాల వల్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల దృష్టిని ఆకర్శించారు. శని, ఆదివారాల్లో ఆయన ఏపీ వార్తల్లో నిలిచారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వైజాగ్ లో శనివారం చోటు చేసుకున్న ప‌రిణామాల ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వైపు, త‌న‌ పార్టీ వైపు ప్రజల దృష్టిని ఆకర్షించుకోవ‌డంలో విజ‌యం సాధించారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అంశంలో వెనుక‌బ‌డిపోయింది. వివాదాలు, రచ్చబండలు, పోలీసుల జోక్యాల మధ్య పవన్ బహిరంగ కారు ర్యాలీ నిర్వహించారు. అయితే టీడీపీ ఉత్తర ఆంధ్ర పరిణామాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. అయితే దానిపై పెద్దగా దృష్టిని ఆకర్షించలేకపోయింది.

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘విశాఖ గర్జన’ పేరుతో చేపట్టిన ర్యాలీ వర్షంలో కూడా హిట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. అమరావతి-అరసవల్లి పాదయాత్ర గత నెల రోజులుగా సాగుతోంది. అయితే కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆగ్రహం ఎదుర్కొంటోంది. ఈ యాత్ర త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి యాత్ర ప్రవేశించనుంది. 

కొనసాగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా, ప్రియాంక

రైతులతో పాటు తెలుగుదేశం, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులతో పాటు అమరావతి అనుకూల ఉద్యమకారుల నుంచి నిరసనలు వెల్లువెత్తినప్పటికీ రాజధాని సమస్య తక్షణ భవిష్యత్తులో పరిష్కారమయ్యే అవకాశాలు లేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని వికేంద్రీక‌ర‌ణ అభివృద్ధి కార‌ణాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని వైఎస్సార్‌సీ నిర్ణ‌యించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నాన్ పొలిటికల్ జేఏసీ కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఏపీలో ఇప్పుడు  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల నుండి వికేంద్రీకరణ కోసం సీఎం కు మద్దతు అందించడమే ఎన్ పీజేఏసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌పీజేఏసీ విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. దీనిని ఎదుర్కొనేందుకు విశాఖపట్నంలో టీడీపీ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించినా వైఎస్సార్‌సీపీ మెగా ర్యాలీ దృష్ట్యా విఫలమైంది.

ఉద్యోగులకు దీపావళి సర్ ప్రైజ్..1.2 కోట్లతో కార్లు, బైక్ లు కొనుగోలు చేసి అందించిన జ్యువెలరీ షాప్ యజమాని..

ఇదిలా ఉండగా షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నం వచ్చిన పవన్ శనివారం పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు విమానాశ్రయం నుంచి నేరుగా కారులో హోటల్‌కు వెళ్లాలి. ఆయన ఆదివారం ప్రజావాణి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అక్కడికి వచ్చిన పవన్ అభిమానులు ‘పవన్ సీఎం, సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఐదు గంటల పాటు టాప్-ఓపెన్ వాహనంలో తన రోడ్ షో నిర్వహించారు. దీని వల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో పవన్ మద్దతుదారులు రాష్ట్ర మంత్రుల మార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై రాళ్ళు రువ్వారు, వారి కార్లను ధ్వంసం చేశారు.

అయితే శనివారం అర్ధరాత్రి పోలీసులు పవన్ బస చేసిన హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. మంత్రులపై దాడికి సంబంధించి పలువురు జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులు పవన్‌కు కోపం తెప్పించాయి. పోలీసుల నుండి 41A నోటీసు అందుకున్నప్పటికీ అరెస్టు చేసిన జనసేన నాయకులందరినీ బేషరతుగా విడుదల చేసే వరకు వైజాగ్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఎందుకోసమంటే..

దీని వల్ల పవన్ కల్యాణ్ వార్తల్లో నిలిచారు. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు. శని, ఆదివారాల్లో ఏపీ ప్రజల దృష్టి ఆయ‌న వైపు మ‌ళ్లింది. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని జనాలను ఆకర్షిస్తూ నటుడు పవన్ నాయకుడిగా పరిణతి చెందుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu