పార్లమెంటు సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

Published : Jun 12, 2024, 12:05 PM ISTUpdated : Jun 12, 2024, 12:07 PM IST
పార్లమెంటు సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

సారాంశం

Parliament sessions: ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3వ తేదీ 18వ లోక్ సభ తొలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు ప్రకటించారు. 

Parliament sessions : కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరిన కొద్దిరోజుల్లోనే తొలి పార్లమెంటు సమావేశాలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు ప్రకటించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల (జూన్) 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే 18వ లోక్ సభకు కొత్త స్పీకర్ ఎన్నిక, ఎంపీల ప్రమాణం జరుగుతుందని తెలిపారు.  

18వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగనుండగా... తొలి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అదే సమయంలో ఎంపీలంతా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రివర్గాన్ని పరిచయం చేస్తారు. అనంతరం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అయితే, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది విపక్షం. పార్లమెంటు వేదికగా మోదీ గత పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu