Parliament Security Breach: పార్ల‌మెంట్ పై దాడి.. రంగంలోకి ప్రత్యేక క‌మిటీ

Published : Dec 14, 2023, 11:53 AM ISTUpdated : Dec 14, 2023, 12:10 PM IST
Parliament Security Breach: పార్ల‌మెంట్ పై దాడి.. రంగంలోకి ప్రత్యేక క‌మిటీ

సారాంశం

Parliament attack: బుధవారం ఉదయం ఇద్దరు చొరబాటుదారులు లోక్ సభ చాంబర్ లోకి దూకి క‌ల‌ర్ గ్యాస్ తో దాడి చేసిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘన సంఘటనపై హోం మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.  

Lok sabha Security Breach: 22 ఏళ్ల క్రితం పార్ల‌మెంట్ పై దాడి జ‌రిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. స‌రిగ్గా మ‌ళ్లీ ఇప్పుడు పార్ల‌మెంట్ లో భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న చోటుచేసుకుంది. క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో లోక్ స‌భ‌లో దాడి జ‌రిగింది.  బుధవారం ఉదయం ఇద్దరు చొరబాటుదారులు లోక్ సభ చాంబర్ లోకి దూకి క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో దాడి  చేసిన ఘ‌ట‌న నిందితుల‌ను ఇప్ప‌టికే ఆరెస్టు చేశారు. పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర హోం శాఖ సైతం  ప్ర‌త్యేక‌ విచారణకు ఆదేశించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ అనీష్ దయాళ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది.

లోక్ సభ సెక్రటేరియట్ అభ్యర్థన మేరకు పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనపై ఎంహెచ్ ఏ విచారణకు ఆదేశించింది. సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్ నేతృత్వంలో ఇతర భద్రతా సంస్థల సభ్యులు, నిపుణులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పార్లమెంటు భద్రత ఉల్లంఘనకు గల కారణాలపై విచారణ కమిటీ దర్యాప్తు చేస్తుందనీ, లోపాలను గుర్తించి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తుంద‌ని తెలిపింది. పార్లమెంటులో భద్రతను మెరుగుపరచడంపై సూచనలతో సహా సిఫార్సులతో కూడిన నివేదికను కమిటీ వీలైనంత త్వరగా సమర్పిస్తుందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పార్లమెంటు దాడుల 22వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ ఘటనపై భద్రతా సమీక్ష, ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరుతూ పార్లమెంట్ సెక్రటేరియట్ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన కొన్ని గంటల్లోనే హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు సాగర్ శర్మ, మనోరంజన్  అనే ఇద్దరు వ్యక్తులు జీరో అవర్ సమయంలో సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్ సభ ఛాంబర్ లోకి దూకి సభలోని ఎంపీలకు చిక్క‌కుండా త‌ప్పించుకుంటూ  డ‌బ్బాల‌ను నుంచి క‌ల‌ర్ గ్యాస్ ను స‌భ‌లో విడుద‌ల చేశారు. ఎంపీలు అడ్డుకునే ముందు నినాదాలు చేశారు.

లోక్ సభ చాంబర్ లోపల ఈ ఘటన జరిగినప్పుడు నీలం, అమోల్ అనే ఇద్దరు ఆందోళనకారులు పార్లమెంట్ ఆవరణలో క‌ల‌ర్ గ్యాస్ ను వెద‌జ‌ల్లుతూ నినాదాలు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్రలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందనీ, ఆరుగురు నిందితులు భవనంలోకి వెళ్లాలనుకున్నారని, అయితే ఇద్దరికి మాత్రమే విజిటర్ పాస్ లు లభించాయని పీటిఐ నివేదిక తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంటు భవనంలో భద్రతా ఏర్పాట్లు సరిపోవనీ, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌