కుమార్తె మృతదేహానికి ఐదు రోజులుగా క్షుద్రపూజలు.. బతికించేందుకు ఇంట్లోనే, రహస్యంగా.. తంతు..

By SumaBala BukkaFirst Published Jun 30, 2022, 9:39 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో మృతి చెందిన కుమార్తెను మళ్లీ బతికించేందుకు..ఓ తల్లిదండ్రులు క్షుద్రపూజలు చేశారు. ఐదు రోజులుగా కూతురి శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని.. పూజలు నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్ : uttar pradeshలోని ప్రయాగ్ రాజ్ లో దారుణమైన విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తమ కుమార్తె dead bodyని ఐదు రోజులుగా ఇంట్లోనే దాచిపెట్టారు తల్లిదండ్రులు. ఆమెను తిరిగి బతికించేందుకు witchcraft చేశారు. మృతదేహం కుళ్లిపోయి.. దాన్నుంచి వాసన వస్తున్నప్పటికీ క్షుద్రపూజలు అలాగే కొనసాగించారు. వాసన భరించలేని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ లోని కర్చన ప్రాంతం..దిహా  గ్రామానికి చెందిన అంతిమ యాదవ్ (18) అనే యువతి 5 రోజుల క్రితం ఏదో అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందింది. అయితే, ఆమె చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు తెలియనివ్వలేదు. ఇంట్లో లోపలి నుంచి గడియ పెట్టుకుని..  ఆమెను బతికించేందుకు ఒక మాంత్రికుడితో కలిసి క్షుద్ర పూజలు చేయించారు. ఐదు రోజులు గడుస్తున్నా.. అదే నమ్మకంతో పూజలు చేస్తున్నారు. దీంతో, మృతదేహం కుళ్లిపోయి.. దాని నుంచి  దుర్వాసన రావడం మొదలైంది. దీంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది.  ఆ వాసన మృతురాలి ఇంట్లో నుంచి రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు చుట్టుపక్కల వాళ్ళు.  

బాబోయ్... తల్లి మృతదేహంతో పదిరోజులు ఒకే ఇంట్లో.. తీరా వాసన రావడంతో...

సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న తంతు.. దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. యువతి మృతదేహాన్ని వెంటనే పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కూతురిని బతికించుకోవాలని క్షుద్ర పూజలు చేస్తున్న ఆ కుటుంబీకులు ఈ ఐదు రోజుల నుండి ఏమీ తినకుండా.. కేవలం గంగాజలం మాత్రమే తాగుతూ క్షుద్రపూజలో పాల్గొన్నట్లు  సమాచారం తెలిసింది. ఐదు రోజులుగా ఏమీ తినక పోవడం..  మృతదేహం కారణంగా ఇంట్లో వ్యాపించిన దుర్వాసనలతో.. ఇంట్లో ఉన్న మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.  వారందరినీ చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి బాగాలేదని.. అందుకే ఈ ఘటనపై  వారిని ముందుగా విచారించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని  పోలీసులు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మే 21న లక్నోలో వెలుగులోకి వచ్చింది.  లక్నోకు చెందిన అంకితా దీక్షిత్ అనే 26 ఏళ్ల అమ్మాయి 10 రోజులకు పైగా తన తల్లి శవాన్ని పక్క గదిలోనే ఉంచుకుని ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది లక్నోలోని ఇందిరా నగర్‌లో జరిగింది.ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న లక్నో పోలీసులు అంకితా దీక్షిత్ ఉన్న గది పక్కగదిలో మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను అంకితా తల్లి సునీతా దీక్షిత్ గా గుర్తించారు. సునీతా దీక్షిత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో పనిచేసి పదవీ విరమణ పొందింది. ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

click me!