
Pakistan soldier arrested at rajasthan border: భారత సరిహద్దులో చొరబాటుకు పాల్పడిన పాకిస్తాన్ రేంజర్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవానును అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే ఇది జరిగింది. శనివారం బీఎస్ఎఫ్ రాజస్థాన్ సరిహద్దులో ఒక పాకిస్తాన్ రేంజర్ ని అరెస్ట్ చేయడం... భారత జవానును తిరిగి తెచ్చుకోవడంలో ఇది కీలకం కానుంది. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం (Pahalgam Terror Attack) దాడిలో 26 మంది చనిపోయిన ఒక రోజు తర్వాత బీఎస్ఎఫ్ జవాను పాకిస్తాన్ ప్రాంతంలోకి వెళ్లడంతో వారికి చిక్కాడు.
బీఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్ సరిహద్దులో ఈ రేంజర్ ని అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను సమాధానం చెప్పలేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ రాజస్థాన్ లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరిగింది. దీంతో రాజస్థాన్ లోని సంబంధిత ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.
ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షా (Purnam Kumar Shaw) ని పాకిస్తాన్ రేంజర్లు పంజాబ్ సరిహద్దులో అరెస్ట్ చేశారు. భారత్ ఎన్నిసార్లు అడిగినా పాకిస్తాన్ ఇంకా ఆ జవానును విడుదల చేయలేదు.
పహల్గాం దాడిలో 28 మంది అమాయకులు మరణించిన తర్వాత భారత్ పాకిస్తాన్పై పలు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. వాటిలో
వంటి చర్యలను తీసుకుంది. సరిహద్దులో పాకిస్తాన్ వరుసగా కాల్పులకు తెగబడటంతో భారత్ గట్టి చర్యలు తీసుకుంటోంది.