ఐరాసలో పాక్ మీద ధ్వజమెత్తిన భారత్... ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వెంటనే వెనక్కి వెళ్లాలని హెచ్చరిక..

Published : Nov 17, 2021, 12:12 PM IST
ఐరాసలో పాక్ మీద ధ్వజమెత్తిన భారత్... ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వెంటనే వెనక్కి వెళ్లాలని హెచ్చరిక..

సారాంశం

ఐరాస అందించిన అవకాశాలను పాకిస్తాన్ తుంగలో తొక్కుతోందని, అనవసరంగా విద్వేషాలు రెచ్చగొడుతోందని భారత్ మండిపడింది. యుఎన్‌ఎస్‌సి  నిషేధించిన టెర్రరిస్టులకు అత్యధిక సంఖ్యలో ఆతిథ్యమివ్వడంలో పాకిస్థాన్ అవమానకరమైన రికార్డును కలిగి ఉందని కూడా ఐరాసలో భారత కౌన్సెలర్ నొక్కిచెప్పారు.

న్యూయార్క్ : UN అందించిన ప్లాట్‌ఫారమ్‌లను పాకిస్థాన్ దుర్వినియోగం చేసిందని, న్యూఢిల్లీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రచారం చేసిందని,  కాశ్మీర్ సమస్యను లేవనెత్తి విద్వేశాలకు దారి తీసిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం ఇస్లామాబాద్‌ను నిందించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పాకిస్తాన్ అక్రమ ఆక్రమణ కింద ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని pakistanకు పిలుపునిచ్చింది.

ఐరాసలో India's permanent mission కౌన్సెలర్ డాక్టర్ కాజల్ భట్ మంగళవారం మాట్లాడుతూ "నేను భారతదేశం స్థానం గురించి వర్గీకరించాలనుకుంటున్నాను, జమ్మూ-కాశ్మీర్, లడఖ్ మొత్తం కేంద్రపాలిత ప్రాంతం ఇప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉన్నాయి. ఇందులో పాకిస్తాన్ illegal occupationలో ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని మేం పాకిస్తాన్‌ను కోరుతున్నాం" అని ఆమె అన్నారు.

UNSCలో తన ప్రతిస్పందనను ప్రారంభించే ముందు kajal bhat మట్లాడుతూ... "ఇంతకుముందు పాకిస్తాన్ ప్రతినిధి చేసిన కొన్ని పనికిమాలిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించడానికి నేను మరోసారి ప్రసంగించవలసి వచ్చింది" అని అన్నారు.

ఐక్యరాజ్యసమితి అందించిన ప్లాట్‌ఫారమ్‌లను పాకిస్థాన్ ప్రతినిధి దుర్వినియోగం చేయడం, భారత్‌పై దుష్ప్రచారం చేయడం, దురుద్దేశపూరితమైన ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదని భట్ ఉద్ఘాటించారు. "తమ దేశంలో నెలకొన్ని దుర్భర పరిస్థితుల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి పాకిస్థాన్ ప్రతినిధులు వ్యూహం ఫలించలేదన్నారు. వారి దేశంలో terroristలు స్వేచ్ఛగా గడిపే అవకాశం ఉంది. సాధారణ ప్రజల జీవితాలను ముఖ్యంగా minority communities కు చెందిన వారి జీవితాలను కష్టాల మయం చేస్తున్నారు. దీన్నుంచి అందరి దృష్టి మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు’’ అని మండి పడ్డారు.

"ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం, చురుగ్గా మద్దతివ్వడంలో పాకిస్థాన్‌కు ఒక స్థిర చరిత్ర, విధానం ఉందని సభ్య దేశాలకు తెలుసునని ఆమె ఉద్ఘాటించారు. "ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం, ఆయుధాలను అందజేయడం state policyగా ఉన్న దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది" అని భట్ అన్నారు.

విమానంలో ప్రయాణికుడికి ప్రథమచికిత్స... కేంద్రమంత్రి భాగవత్ కరద్ పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు ...

యుఎన్‌ఎస్‌సి నిషేధించిన అత్యధిక సంఖ్యలో టెర్రరిస్టులకు ఆతిథ్యమివ్వడంలో పాకిస్థాన్ అవమానకరమైన రికార్డును కలిగి ఉందని India's Counsellor కూడా నొక్కిచెప్పారు. న్యూ ఢిల్లీ పాకిస్థాన్‌తో సహా అన్ని దేశాలతో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటోందని పేర్కొంటూ, "సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఏవైనా అసాధారణమైన సమస్యలను ద్వైపాక్షికంగా, శాంతియుతంగా పరిష్కరించేందుకు భారతదేశం కట్టుబడి ఉంది" అని ఆమె అన్నారు.

"అయితే, ఏ అర్ధవంతమైన సంభాషణ అయినా ఉగ్రవాద శత్రుత్వం, హింస లేని వాతావరణంలో మాత్రమే నిర్వహించబడుతుంది" అని భట్ తెలిపారు. అటువంటి అనుకూల వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పైనే ఉందని ఆమె నొక్కిచెప్పుకొచ్చారు, అప్పటి వరకు సరిహద్దు ఉగ్రవాదంపై ప్రతిస్పందించడానికి భారతదేశం దృఢమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని అన్నారామె. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu