ఇండియాలో 5 కోట్ల మందికి హ్యాండ్ వాష్ అందుబాటులో లేదు: రిపోర్ట్

Published : May 21, 2020, 03:19 PM IST
ఇండియాలో 5 కోట్ల మందికి హ్యాండ్ వాష్ అందుబాటులో లేదు: రిపోర్ట్

సారాంశం

భారత్ లో 5 కోట్ల మందికి పైగా అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలు సరైన రీతిలో చేతులు శుభ్రపర్చుకొనే సదుపాయానికి నోచుకోలేదని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. చేతులు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా  కరోనా నుండి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ: భారత్ లో 5 కోట్ల మందికి పైగా అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలు సరైన రీతిలో చేతులు శుభ్రపర్చుకొనే సదుపాయానికి నోచుకోలేదని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. చేతులు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా  కరోనా నుండి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శుభ్రమైన నీరు, సబ్బు అందుబాటులో లేని అల్పాదాయ, మధ్యశ్రేణి రాబడి ఉన్న దేశాల్లోని 2 బిలియన్ ప్రజలకు కరోనా బారినపడే అవకాశం ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ కు చెందిన  హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌ (హెచ్‌ఎంఈ) సంస్థ అధ్యయనం చేసింది. 46 దేశాల్లో సగానికి పైగా ప్రజలకు సబ్బు, సురక్షిత నీరు అందుబాటులో లేదని ఈ అధ్యయనం తేల్చింది.

also read:త్వరలోనే రైల్వే బుకింగ్ కౌంటర్లు ప్రారంభం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

 భారత్‌, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, ఇథియోపియా, కాంగో, ఇండోనేషియాల్లో ప్రతి దేశంలో 5 కోట్ల మందికి సరైన హ్యాండ్‌వాషింగ్‌ సదుపాయం అందుబాటులో లేదని అంచనా వేసింది.

 హ్యాండ్‌ శానిటైజర్లు, మంచినీటి ట్యాంకర్ల సరఫరా అనేది తాత్కాలిక ఉపశమనమేనని కరోనాను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని ఐహెచ్ఎంఈ ప్రొఫెసర్ మైఖేల్ బ్రౌర్ చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే | Ayodhya Ram Mandir Donation Theft?
Indian Railways: మరీ ఇంత కక్కుర్తా? ట్రైన్‍లో దుప్పట్లు, ఫేస్ టవల్స్ ఎత్తుకెళ్లిన ప్యాసింజర్లు..రైల్వేకు రూ.కోట్ల నష్టం