ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణి దాడులు

Published : May 07, 2025, 03:55 AM ISTUpdated : May 07, 2025, 04:17 AM IST
ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణి దాడులు

సారాంశం

Operation Sindoor:పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ దాడులు పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా జరిగాయని చెప్పారు.

Operation SIndoor పాకిస్తాన్  పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారు జామున భీకరమైన వైమానిక క్షిపణి దాడులు చేశాయి. 'ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ దాడుల గురించి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.
Xలో ఒక పోస్ట్‌లో, రక్షణ మంత్రి "భారత్ మాతా కీ జై" అని రాశారు. ఇంతలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా భారత సైన్యాన్ని ప్రశంసించారు. Xలో పోస్ట్‌లో, ఆయన "జై హింద్! జై హింద్ కీ సేన!" అని రాశారు.
అయితే, భారతదేశం దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లోని భింబర్ గాలి ప్రాంతంలో కాల్పులు జరిపింది. భారత సైన్యం "సరైన రీతిలో ప్రతిస్పందిస్తోంది" అని అధికారులు తెలిపారు.
Xలో ఒక పోస్ట్‌లో, అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ADG PI)  : "పూంచ్-రాజౌరి ప్రాంతంలోని భింబర్ గాలిలో కాల్పులు జరిపడం ద్వారా పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం సరైన రీతిలో ప్రతిస్పందిస్తోంది." అని వివరించారు.
భారతదేశం ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత కాల్పులు జరిగాయి - పాకిస్తాన్, PoKలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి.
"కొద్దిసేపటి క్రితం, భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించాయి, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి, మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడి చేశామని " రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

మొత్తం తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా 

"మా చర్యలు చాలా  కేంద్రీకృతమైనవి. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడుల పద్ధతిలో భారతదేశం గణనీయమైన సంయమనం ప్రదర్శించింది" అని రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో  పేర్కొంది.
'ఆపరేషన్ సింధూర్'పై ఈ రోజు డీటైల్డ్ ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇంతలో, Xలో ఒక పోస్ట్‌లో, భారత సైన్యం "న్యాయం జరిగింది. జై హింద్!" అంటూ పోస్ట్ చేసింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu