ఏకాంతంగా ప్రేమ జంట... గుండు కొట్టించిన స్థానికులు

Published : Jun 25, 2019, 09:34 AM ISTUpdated : Jun 25, 2019, 09:49 AM IST
ఏకాంతంగా ప్రేమ జంట... గుండు కొట్టించిన స్థానికులు

సారాంశం

ఏకాంతంగా గడుపుతున్న ప్రేమ జంటపై స్థానికులు దారుణంగా ప్రవర్తించారు. ప్రేమ జంట పై దాడి చేసి గుండు కొట్టించారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏకాంతంగా గడుపుతున్న ప్రేమ జంటపై స్థానికులు దారుణంగా ప్రవర్తించారు. ప్రేమ జంట పై దాడి చేసి గుండు కొట్టించారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఓ యువకుడు తన ప్రియురాలితో ఏకాంతంగా గడపుతుండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు ఇద్దరిని విచక్షణా రహితంగా చితకబాదారు. అందరి ముందు గుండు కొట్టించారు. ఈ ఘటన మయూర్‌భంజ్‌, కరంజిలా బ్లాక్‌లోని మండువా గ్రామంలో గత శనివారం  చోటుచేసుకుంది. 

వారిద్దరికి గుండు కొట్టించడమే కాకుండా సెలఫోన్లలో ఫొటోలు తీశారు. అవి కాస్త సోషల్‌మీడియా వేదికగా వైరల్‌ కావడంతో పోలీసులు దృష్టికి వచ్చింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇక మేజర్లైన యువతీ యువకులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే

 

PREV
click me!

Recommended Stories

Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?