'2022 అద్భుత సంవత్సరం కాదు..': ప్రధాని మోడీపై మల్లికార్జున్ ఖర్గే ధ్వజం

Published : Dec 30, 2022, 12:33 AM IST
'2022 అద్భుత సంవత్సరం కాదు..': ప్రధాని మోడీపై మల్లికార్జున్ ఖర్గే ధ్వజం

సారాంశం

2022 అద్భుత సంవత్సరం కాదని,  గ్యాస్ సిలిండర్లు, పాలు, పప్పుల ధరలను ప్రస్తావిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. 2022లో మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ ఏడాది ప్రజలకు బాధాకరమన్నారు. 

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ: 2022 సంవత్సరం ముగుస్తోంది, అయితే ఈలోగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, 2022లో మోడీ ప్రభుత్వం ఏమి చేసిందో కాంగ్రెస్ విమర్శించింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని ఉటంకిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. 2022 సంవత్సరం అద్భుతమైనది కాదని, ప్రజలకు బాధాకరమైన సంవత్సరం అని ఆరోపించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ.. “నరేంద్ర మోదీ జీ, గ్యాస్ సిలిండర్ ధర ఏడాదిలో రూ. 200 పెరిగింది. పాల ధర సగటున రూ.10 పెరిగింది. అర్హర్ పప్పు రూ.10 పెరిగింది. వంట నూనె ధర రూ.15-20 పెరిగింది. పిండి ధర 25 శాతం పెరిగింది. ఇది అద్భుతమైన సంవత్సరం కాదు. "డిస్ట్రెస్‌ఫుల్ ఇయర్" సామాన్యుల వంటగదికి బాధాకరమైన సంవత్సరం.

2022ని ప్రధాని మోదీ ఎలా వివరించారు?

ఆదివారం (డిసెంబర్ 25 న) నిర్వహించిన 'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. 2022లో చాలా స్ఫూర్తిదాయకంగా ఘటనలు, అనేక అద్భుతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ సంవత్సరంతో భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అమృతకల్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం దేశం కొత్త ఊపందుకుంది. దేశవాసులందరూ ఒకటి కంటే ఎక్కువ పనులు చేసారు.

2022 సంవత్సరం మరో కారణంతో ఎప్పటికీ గుర్తుండిపోతుందని 'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది 'ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతతో  అనేక అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారన్నారు. ఆగస్టు నెలలో 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ఎవరు మర్చిపోలేరనీ, ఈ కార్యక్రమంతో ప్రతి భారతీయుడు చిరకాలం గుర్తుకు పెట్టుకునే క్షణాలను స్వంతం చేసుకున్నారని అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu