కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్ నో

By narsimha lodeFirst Published Apr 12, 2019, 4:16 PM IST
Highlights

 న్యూఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని 7 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుంది.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని 7 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుంది.

న్యూఢిల్లీ రాష్ట్రానికి ఎఐసీసీ ఇంచార్జీ పీసీ చాకో ఆప్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో మా పార్టీతో పొత్తుకు సిద్దంగా ఉందన్నారు. కానీ, ఢిల్లీలో పొత్తుకు తాము సానుకూలంగా ఉన్నామని  ఆయన చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీతో మూడు లేదా నాలుగు ఎంపీ సీట్లు కోరుకొన్నారు. కానీ, ఆప్ మాత్రం ఈ సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా లేదన్నారు.  బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటులో ఆప్ కలిసి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
 

click me!