గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం, తొమ్మిదిమంది సజీవదహనం

Published : Jul 18, 2018, 04:53 PM IST
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం, తొమ్మిదిమంది సజీవదహనం

సారాంశం

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సౌరాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవదహనమయ్యారు.  ట్రక్కు-కారు ఢీ కొట్టుకోవడం, వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.  

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సౌరాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవదహనమయ్యారు.  ట్రక్కు-కారు ఢీ కొట్టుకోవడం, వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు కుచ్ నుంచి రాజ్‌కోట్‌కు ఓ కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మోర్బి పట్టణ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. కారు, ట్రక్కు మితిమీరిన వేగంతో ఢీ కొన్నాయి. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ట్రక్కు డ్రైవర్ ఈ ప్రమాదం నుండి సైఫ్ గా బైటపడి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
  

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?