కేరళలోని పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు..

Published : Aug 13, 2023, 11:25 AM IST
కేరళలోని పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు..

సారాంశం

Malappuram: కేరళలోని మలప్పురంలో పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. తొర్రూరు, తానూర్‌ ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్తల నాలుగు ఇళ్లపై దాడులు జరుగుతున్నాయ‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన సోదాలు ఏకకాలంలో జరిగాయి.  

NIA raids: కేరళలోని మలప్పురంలో పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. తొర్రూరు, తానూర్‌ ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్తల నాలుగు ఇళ్లపై దాడులు జరుగుతున్నాయ‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన సోదాలు ఏకకాలంలో జరిగాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఉగ్ర‌వాద సంబంధాలు, దేశ వ్య‌తిరేక చ‌ర్య‌ల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మ‌రోసారి కేర‌ళ‌లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మాజీ కార్యకర్తలకు చెందిన నాలుగు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం సోదాలు నిర్వహిస్తోంది. మలప్పురం జిల్లాలోని తిరూర్, తానూర్ ప్రాంతాల్లోని మాజీ పీఎఫ్ఐ కార్యకర్తల నాలుగు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.

దాడులు ప్రారంభం కావడానికి ముందు తమకు సమాచారం అందిందని మలప్పురం జిల్లా పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. తెల్లవారు జామున ప్రారంభమైన ఈ తనిఖీలు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. అంతకుముందు మలప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ ప్రధాన కార్యాలయం గ్రీన్ వ్యాలీపై ఎన్ఐఏ దాడి చేసి సీజ్ చేసింది. కాగా, 2022 సెప్టెంబర్ లో పీఎఫ్ఐని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధించి, దాని నాయకులను చాలా మంది జైళ్లలో పెట్టింది. దేశవ్యాప్తంగా పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న పీఎఫ్ఐ భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అంత‌కుముందు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలపై ఏప్రిల్ 25న ఎన్ఐఏ దాడులు ప్రారంభించింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్ లలో డజనుకు పైగా చోట్ల సోదాలు జ‌రిపింది. బీహార్ లో 12, ఉత్తరప్రదేశ్ లో 2, పంజాబ్ లోని లుధియానా, గోవాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. నిషేధిత సంస్థ పీఎఫ్ఐకి సంబంధించి బీహార్ లోని దర్భంగా నగరంలోని ఉర్దూ బజార్ కు చెందిన దంతవైద్యుడు డాక్టర్ సారిక్ రజా, సింగ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్పూర్ గ్రామానికి చెందిన మెహబూబ్ అనే వ్యక్తి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu